అమరావతి: ఇక నుంచి ప్రతి 15 రోజులకోసారి ఏపీ రాష్ట్ర కేబినెట్ సమావేశం కానున్నట్లు ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు
జారీ చేశారు. ప్రతి నెలా రెండు, నాలుగు బుధవారాల్లో ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం అవుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒకవేళ బుధవారం సెలవు దినమైతే మరుసటి రోజు సమావేశం నిర్వహిస్తామని సీఎస్ వెల్లడించారు. మంత్రులు వారి ప్రతి శాఖకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. అలాగే... ప్రతి నెల ఒకటి, మూడు శనివారాల్లో శాఖల వారీగా ప్రతిపాదనలు తెలపాలని ఎల్వీ సుబ్రహ్మణ్యం సూచించారు.