హైదరాబాద్: అన్ని జిల్లాల కలెక్టర్లతో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ...
స్వచ్ఛ్ సర్వేక్షణ్ మార్గదర్శకాల మేరకు పారిశుద్ధ్య సిబ్బంది, వాహనాలు ఉండాలని తెలిపారు. పురపాలక సిబ్బందికి కూడా ప్రభుత్వమే బీమా సౌకర్యం కల్పిసుందన్నారు. డంపింగ్ యార్డుల కోసం వెంటనే భూసేకరణ చేపట్టాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణపై వారం రోజుల్లో ప్రణాళిక రూపొందించి పురపాలక శాఖకు ఇవ్వాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. అలాగే... నగరంలో మరిన్ని షీ-టాయిలెట్లను నిర్మించాలని కూడా మంత్రి కేటీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.