హైదరాబాద్: హైదరాబాద్లో తొలిసారి వరల్డ్ డిజైన్ అసెంబ్లీ సమావేశాలు జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. నగరంలోని హెచ్ఐసీసీలో రెండో రోజు
వరల్డ్ డిజైన్ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఔత్సాహికులను అన్ని విధాలా ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుటుందన్నారు. ఐటీ రంగంలో బెంగళూరు కంటే హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని మరోసారి స్పష్టం చేశారు. సైబర్ టవర్స్ కి ధీటుగా నగరంలో టీ-హబ్, టీ-వర్క్స్, ఇమేజ్ టవర్స్ నిర్మాణం జరుగుతోందన్నారు. అలాగే... నేషనల్ డిజైన్ సెంటర్ను రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో ఏర్పాటు చేస్తుందని తెలిపారు. త్వరలోనే హైదరాబాద్ గ్లోబల్ డిజైన్ డెస్టినేషన్ కాబోతుంది అని మంత్రి తెలిపారు. అనంతరం పద్మశ్రీ చింతకింది మల్లేషం తయారు చేసిన ఆసు యంత్రాలను చేనేత కళాకారులకు మంత్రి కేటీఆర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ తో పాటు... ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ పాల్గొన్నారు.