తెలంగాణ సీఎం కేసీఆర్ ఇక బస్సు బాట పట్టనున్నరు. ఎక్కడికైనా సరే బస్సే అంటున్నారు.

ఇదేంటీ అనుకుంటున్నారా? ఏడాది పాలనలో తెలంగాణసీఎం కేసీఆర్ ఎక్కడికి వెళ్లాలన్నా హెలికాప్టర్ నే వినియోగిస్తూ వచ్చారు.. హెలికాప్టర్ లో ఆయన తిరగని జిల్లాలు లేవు... తిరగని ఊరూ లేదు. తుదకు హైదరాబాద్ లో సైతం కూడా.. గాలి మోటర్ లోనే ప్రయాణించి రికార్డు సృష్టించారు కేసీఆర్. కారణాలేమైనా... ఇకపై హెలికాప్టర్ లో కాకుండా బస్సులోనే జిల్లాలు తిరుగుతానని ప్రకటించారు కేసిఆర్ ఏడాది పాలనలో ఆదినుంచీ..తెలంగాణ రాష్ట్ర సీఎం కెసిఆర్ రోడ్డు మార్గంలో వెళ్లడం కంటే గగనమార్గంలో వెళ్లేందుకే ఇస్టపడేవారు. ఆయన అన్ని జిల్లాలను హెలికాప్టర్ లోనే చుట్టొచ్చారు. యాదగిరిగుట్టకు అనేకసార్లు హెలికాప్టర్ లో వెళ్లారు. మొన్న జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ కోటా ఎన్నికల వరకూ కేసీఆర్ ప్రతీ పర్యటన గగనమార్గంలోనే సాగింది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో అధికార టిఆర్ఎస్... నల్లగొండ, ఖమ్మం, వరంగల్ స్థానాన్ని కైవసం చేసుకోగా... హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ ఎమ్మెల్సీ సీటును కోల్పోయింది. ఆ ఫలితాలు వచ్చే వరకు సిఎం కెసిఆర్ ప్రతీ పర్యటన గగన మార్గంలోనే సాగింది. ఆ ఫలితాలు వచ్చిన తర్వాత హెలికాప్టర్ ప్రయాణాన్ని మెల్లమెల్లగా తగ్గించారు కెసిఆర్. ఇటీవల హరితహారం పథకంపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఫారెస్టు అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్న సమావేశంలో తన పర్యటనలపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇకపై జిల్లాలకు హెలికాప్టర్లలో కాకుండా బస్సుల్లోనే వెళ్లనున్నట్టు ప్రకటించారు.. ఇనాళ్లు హెలికాప్టర్ లో ప్రయాణించిన సీఎం కెసిఆర్... ఉన్నట్లుండి బస్సులో జిల్లా పర్యటనలు చేస్తానని చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సిఎం వెళ్లడమే కాదు.. తెలంగాణ రాష్ట్ర మంత్రులు సైతం అత్యవసర సమయాల్లో హెలికాప్టర్ ను వినియోగించి రాష్ట్రంలో సరికొత్త రికార్డు సృష్టించారు. ఉమ్మడి రాష్ట్రంలో సైతం అత్యవసర సమాయాల్లో ముఖ్యమంత్రులు మాత్రమే హెలికాప్టర్ లు వినియోగించిన సందర్భం ఉంది. కానీ... తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు ఆ జిల్లాకు చెందిన మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్ రెడ్డి హెలికాప్టర్ లో ప్రయాణించారు. అదే కాకుండా భద్రాచలం వంతెన పైనుంచి బస్సు బోల్తా పడిన సంఘటన జరిగిన వెంటనే... మంత్రి మహేందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు హెలికాప్టర్ లో వెళ్లి అక్కడి పరిస్థితులను పర్యవేక్షించారు. మరోవైపు వర్షాకాలం మొదలు కావడంతో... హెలికాప్టర్ ప్రయాణం అంతగా అనుకూలించే పరిస్థితి లేకపోవడం కూడా కెసిఆర్ రోడ్డు మార్గాన్ని ఎంచుకోవడానికి మరో కారణంగా చెబుతున్నారు. ఏవియేషన్ అధికారులు సైతం వర్షాకాలంలో హెలికాప్టర్ వాడకం అంత అనుకూలం కాదని సిఎంకు నివేదించినట్లు తెలిసింది. ఇటీవల డిండి ఎత్తిపోతల ప్రారంభోత్సవానికి హెలికాప్టర్ లో వెళ్లాలనుకున్నా, ప్రతికూల వాతావరణం కారణంగా ఏవియేషన్ అధికారులు అనుమతించలేదు. అంతేకాకుండా, గతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదాలు ఎక్కువగా వర్షాకాలంలోనే జరిగిన విషయం తెలిసిందే.

e-max.it: your social media marketing partner

బద్దలైన కాంగ్రెస్ కోట

ప్రతిష్ఠాత్మక హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. ఆ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి ఎవరూ ఊహించన...

మహారాష్ట్ర ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ

హైదరాబాద్: త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర...

బలవంతపు భూ సేకరణ జీవోను రద్దు చేయండి... సీఎం జగన్ కు ఎమ్మెల్యే లేఖ

గుంటూరు: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబు ప్రభుత్వం జారీ చేస...

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం...

పశ్చిమగోదావరి: జిల్లాలోని పోడూరు మండలం కవిటం గ్రామంలో దారుణం జరిగింది. తన ప్రేమను ఒప్పుకోలేదని ఓ యువతిపై ప్రేమ...

యూనియన్ల విష కౌగిలి నుంచి బయట పడితేనే... -సీఎం కేసీఆర్

ఆర్టీసీ యూనియన్ల విష కౌగిలి నుంచి బయటపడిప్పుడే కార్మికులకు భవిష్యత్తు అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. కార్మికులు...

నేను కాదు... ఆర్టీసీని ఎవరూ కాపాడలేరు -కేసీఆర్

ఈ దేశంలో తెలంగాణయే కాదు... ఏ ఆర్టీసీని కూడా ఎవరూ కాపాడలేరని కుండబద్దలు కొట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్.

అమెరికాలో ‘హౌడీ మోదీ’ హీట్...

అమెరికాలో ‘హౌడీ మోదీ’ హీట్...

హౌస్టన్: ‘హౌడీ మోదీ’ మెగా ఈవెంట్‌కు రంగం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో హౌస్టన్ వేదికగా 'హౌడీ మోదీ' ఈవెంట్ ప్రా...

ట్రంప్ తో మోడీ కీలక భేటీ...

ఫ్రాన్స్: చర్చల ద్వారానే భారత్ - పాక్ దేశాలు సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఫ్రాన్స...

తెలంగాణ సీఎస్ కి, ఆర్టీసీ ఎండీకి.. బీసీ కమిషన్‌ నోటీసులు

ఢిల్లీ: ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సీఎస్ ఎస్‌కే జోషి, ఆర్టీసీ ఎండీకి జాతీయ బీసీ కమిషన్ నోటీసులు పంపింది. వ్యక్తిగ...

మహారాష్ట్ర, హర్యానలో ముగిసిన ఎన్నికల ప్రచారం...

మహారాష్ట్ర, హర్యానలో ముగిసిన ఎన్నికల ప్రచారం...

ముంబై: మహారాష్ట్ర, హర్యాన అసెంబ్లీ ఎన్నికలకు నేటి సాయంత్రంతో ప్రచారం ముగిసింది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ నియో...

మంచిర్యాలలో NIA సోదాలు...

మంచిర్యాల: జిల్లా నడిబొడ్డున NIA అధికారులు ఆకస్మిక సోదాలు చేశారు. నిన్న(శుక్రవారం) మంచిర్యాల బస్ స్టాండ్ ఎదురు...

తెలంగాణ బంద్ ప్రశాంతం... పలుచోట్ల రాళ్ల దాడి

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన రాష్ట్రబంద్ నేతల అరెస్టులతో పలు చోట్ల ఉద్రిక్తంగా మారింది. బంద్...

పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 175...

'సైరా' చూడండి... గవర్నర్ కి మెగాస్టార్ విన్నపం

'సైరా' చూడండి... గవర్నర్ కి మెగాస్టార్ విన్నపం

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసైసౌందర్ రాజన్ తో మెగాస్టార్ చిరంజీవి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాను నటించిన...

రోహిత్ శర్మ సెంచరీ... పటిష్ట స్థితిలో భారత్

రోహిత్ శర్మ సెంచరీ... పటిష్ట స్థితిలో భారత్

రాంచీ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. తొలి టెస్ట్ రెండు ఇన్నింగ...

మూడో టెస్టులో ఆచూతూచి ఆడుతున్న భారత్...

మూడో టెస్టులో ఆచూతూచి ఆడుతున్న భారత్...

రాంచీ: సౌతాఫ్రికాతో రాంచీలో జరుగుతున్న మూడవ (చివరి) టెస్టులో భారత్ తడబడింది. తొలి రెండు టెస్టుల్లో సెంచరీలతో ర...

హైటెక్స్‌లో మూడు రోజుల పాటు ట్రెడా ప్రాపర్టీ షో...

హైదరాబాద్‌: నగరంలోని మాదాపూర్ హైటెక్స్‌లో ట్రెడా ప్రాపర్టీ షోని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఈ రోజు ప్రారంభిం...

ఆర్థిక రంగానికి ఊతం... కొత్త ఆర్ధిక సంస్కరణలు: నిర్మలా సీతారామన్

ఢిల్లీ: దేశంలో ఆర్ధిక వృద్ధి ఆశించిన స్థాయిలోనే ఉందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆర్ధిక మాంద్...