టెన్షన్ లేనేకా నహీ...! టెన్షన్ దేనేకా హై...! తెలుగు రాష్ట్రాల సీఎంలు..., ఇద్దరు చంద్రుల మధ్య సరికొత్త మైండ్ గేమ్ మొదలైంది..! ఏదో జరుగుతోంది...ఇంకేదో జరగబోతోందంటూ ముందు లీకులు ఇస్తున్నారు..! ఆపై ఇరు రాష్ట్రాల మంత్రులు మాటల యుద్ధం...! ఆ వెంటనే గవర్నర్ నరసింహన్ తో భేటీలు...సచివాలయంలో సమీక్షలు...! సవాళ్లకు ప్రతి సవాళ్లు..! ఓటుకు నోటుతో మొదలైన ఈ లొల్లి...ఏపీ నేతల ఫోన్ల ట్యాఫింగ్ ఆరోపణలతో తారస్థాయికి చేరింది.
ఇప్పుడు సెక్షన్ 8, హైదరాబాద్ పై సీమాంధ్రుల హక్కుల సెంటర్ పాయింట్ గా జగడం జరుగుతోంది..! తాజాగా ఇద్దరు టీ టీడీపీ నేతలకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. టీ టీడీపీ నేత వెం నరేందర్ రెడ్డిని గంటలపాటు విచారించారు. దీంతో ఇరు రాష్ట్రాలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. బుధవారం ఉదయం గవర్నర్ తో భేటీ అయిన కేసీఆర్ ఈ వ్యవహారంపై చర్చించినట్లు సమాచారం. మరోవైపు జరుగుతున్న పరిణామాలపై ఏపీ సర్కార్ కేబినెట్ సమావేశంలో చర్చించింది. మొత్తానికి ఈ వివాదం క్లైమాక్స్ కు చేరినట్లే కనిపిస్తోంది..!
తెలుగు రాష్ట్రాల మధ్య కథ క్లైమాక్స్ చేరినట్లే కనిపిస్తోంది..! ఇక ఇద్దరు చంద్రుల సీన్ ఆఫ్ యాక్షన్ పై మరో రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది..! ఏది ఏమైనా తెలంగాణ సర్కార్ ఓటుకు వ్యవహారంలో తన దూకుడును కొనసాగిస్తూనే ఉంది.. టీ టీడీపీ నేతలు వెం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్రకు రాత్రికి రాత్రే నోటీసులు జారీచేసినా ఏసీబీ...బుధవారం నాలుగు గంటలపాటు విచారణ అనంతరం వేం నరేందర్ రెడ్డిని వదిలివేసింది.
రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు...! పార్టీలన్నీ టైమింగ్ ను బట్టి దూకుడు ప్రదర్శిస్తాయ్..! ప్రత్యర్థుల్ని డిఫెన్స్ లో నెట్టేస్తాయి..! ఓటుకు నోటు కేసులో తెలంగాణ సర్కార్ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. ఏసీబీ డీజీ ఏకే ఖాన్ మంగళవారం ఒకే రోజు రెండు సార్లు తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. అటు తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి గవర్నర్ నరసింహన్ ను కలిశారు. దీంతో ఈ కేసులో ఏవో కీలక పరిణమాలు జరగనున్నాయనే ప్రచారం మొదలైంది. ఇటు సీఎం కేసీఆర్ తో వీరు భేట అయ్యారు. ఆ తర్వాత రాత్రి మరోసారి సమావేశమయ్యారు. ఈ కేసు పై తాము తీసుకోబోతున్న చర్యలను అటు గవర్నర్ , ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఏసీబీ డీజీ ఏకే ఖాన్ ఎప్పటికప్పుడు వివరిస్తున్నారు.
ఇప్పటికే ఈ వ్యహారంలో రేవంత్ రెడ్డిని అరెస్టు చేసిన ఏసీబీ ఇప్పుడు మరింత దూకుడును పెంచింది. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు, కాల్ డేటాతో సేకరించిన సమాచారం ఆధారంగా తెలుగు దేశం ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలపై దృష్టి పెట్టింది. రాత్రికి రాత్రే ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని సండ్ర నివాసానికి వెళ్లిన ఏసీబీ అధికారులు ముడుపుల కేసులో విచారణకు హాజరు కావాలని...సీఆర్ పీసీ సెక్షన్ 160 ప్రకారం ఆదేశిస్తూ నోటీసులు కిటికి గుండా జారవిడిచారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేరు... ఆ తర్వాత రాత్రి 11:30కు ఆదర్శ్ నగర్ లోని వేం నరేందర్ నివాసానికి చేరుకున్న ఏసీబీ అధికారులు....వేం నరేందర్ ను విచారణ కోసం తమతోపాటు రావాలని కోరారు. దీనికి ఆయన నిరాకరించారు.అతనకు ఆరోగ్యం సరిగా లేదని ఉదయం విచారణకు హాజరవుతానని ఆయన తెలపడంతో ఏసీబీ అధికారులు వెనుదిరిగారు.
బుధవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలపాటు వేం నరేందర్ రెడ్డిని విచారించిన ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్టు చేస్తున్నట్లు మొదట ప్రచారం జరగింది. అయితే తనను అరెస్టు చేయలేదని...విచారణకు ఎప్పుడు పిలిచిన రావాలన్నారని...విచారణ అనంతరం వేం నరేందర్ రెడ్డి తెలిపారు.
ఈ కేసులో ఏ 2గా ఉన్న సెబాస్టియన్ ఫోన్ నుంచి ఎక్కువ సార్లు టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు కాల్స్ వెల్లినట్లు ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారం వల్ల అంతిమంగా లబ్ది చేకూరేది నరేందర్ రెడ్డి కావడంతో...ముడుపుల బాగోతం మొత్తం ఆయనకు కూడా తెలుసివుంటుందని ఏసీబీ భావిస్తోంది. అందుకే మొదట వీరిద్దరిని ప్రశ్నించారని భావిస్తున్నారు. ప్రాథమికంగా తగిన ఆధారాలు సేకరించాకే ఇద్దరికి నోటీసులు ఇచ్చారని చెబుతున్నారు. స్టీఫెన్కు మరో నాలుగున్నర కోట్ల రూపాయలను నరేందర్ రెడ్డి ద్వారా సర్దుబాటు చేసే ప్రయత్నం జరిగినట్లు ఏసీబీ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం..ఆ కోణంలో నే ఆయన్ను..మంగళవారం రాత్రే ఏసీబీ అధికారులు అరెస్టు చేస్తారని ప్రచారం జరిగింది.
అటు ఈ వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 19 వ తేదీలోగా ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని పేర్కొంది. శుక్రవారం సాయంత్రం విచారణకు హాజరయ్యే సండ్రను సైతం ఏసీబీ అధికారులు అరెస్టు చేస్తారనే ప్రచారం ఇప్పుడు జోరుగా సాగుతోంది. టీడీపీ నేతలు వేం నరేందర్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య విచారణలో తెలిపే సమాచారం ఆధారంగా మరికొంత మందికి నోటీసలుఉ జారీ చేస్తారని అంటున్నారు.ఏసీబీ నోటీసులు అందుకునే వారిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోపాటు ఆయనకు సన్నిహితంగావుండే ఓ కేంద్రమంత్రి, ఏపీ రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రముఖులు కూడా ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయ్.
రేవంత్ కాల్ డేటాలో వందల సంఖ్యలో ఇన్ కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్ ఉన్నప్పటికీ... సహ నిందితులతోపాటు ఇతర రాజకీయ ప్రముఖులతో ఆయన ఎక్కువసార్లు సంభాషణలు సాగించినట్లు గుర్తించారు. వీరిలో ఏపీ సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే వారు, కొందరు వ్యాపార ప్రముఖులు ఉన్నారని సమాచారం. రేవంద్ ను అరెస్టు చేసిన సమయంలో రికార్డు చేసిన ఆడియో, వీడియో టేపులు, ఐఫోన్లు...సోదాల్లో రేవంత్ ఇంట్లో స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్ ను పరీక్షల నిమిత్తంఎఫ్ఎస్ఎల్ కు తరలించారు. వీటిని మూడు దశల్లో పరీక్షించాల్సివుంది. ఇక ఈ కేసులో ప్రధాన సాక్షి, ఫిర్యాదుదారుగా ఉన్న స్టీఫెన్ బుధవారం ఏసీబీ కోర్టులో తన వాంగ్మూలం ఇచ్చారు.
మొత్తానికి హైడ్రామా మధ్య...వేం నరేందర్ రెడ్డి తిరిగి ఇంటికి వెళ్లారు..ఇక మిగిలింది ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. విచారణకు హాజరయ్యే ఆయన్ను అరెస్టు చేస్తారా ? లేక ప్రశ్నించి వదిలేస్తారా ? ఇప్పుడు ఇదే హాట్ టాఫిక్ గా మారింది.!