ఓటుకు నోటు కేసు విచారణ రోజుకో మలుపు తిరుగుతుంది..! అటు ఈ కేసులో ఫిర్యాదుదారుడు స్టీవెన్ సన్ మెజిస్ట్రేట్ ముందు తన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. 

సినిమా కథ మాదిరిగానే ఓటుకు నోటు కేసులో ట్విస్టుల మీద ట్వీస్టులే ఉన్నాయ్..! రేవంత్ అరెస్టుతో ఇది ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. స్టీవెన్ సన్ తో ఏపీ సీఎం చంద్రబాబు టేపులు బయటపడడంతో ఈ వివాదం తారస్థాయికి చేరింది. దీంతో ఉమ్మడి రాజధానిలో ఏపీ పీఎం, మంత్రుల ఫోన్ల ట్యాపింగ్ ఆరోపణలతో మరో మలుపు తిరిగింది. ఆ తర్వాత సీన్ ఢిల్లీకి మారింది. ఏపీ సీఎం చంద్రబాబుతోపాటు, తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ఏపీ విపక్ష నేత జగన్ కూడా హస్తిన బాట పట్టారు. హైదరాబాద్ లో ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు దీనిపై రాష్ట్రపతి, ప్రధానమంత్రి, హోంమంత్రికి ఫిర్యాదు చేశారు. చట్టవ్యతిరేకంగా తమ ఫోన్లను టీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాపింగ్ చేయడమేగాక..తమను బ్లాక్ మెయిల్ చేసి బెదిరిస్తోందని ఆయన ఆరోపించారు. ఏపీకి చెందిన సుమారు 120 మంది ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేశారన్న  విషయంపై సీఎం చంద్రబాబు నాయుడు సాక్ష్యాధారాలతో సహ అందజేశారు. దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం ఇప్పటికే అంతర్గత విచారణకు ఆదేశించింది. ఒకటి రెండు రోజుల్లో కేంద్ర హోంశాఖ కార్యదర్శి కూడా హైదరాబాద్ వస్తారని ప్రచారం జరుగుతోంది. 

అటు గవర్నర్ తీరుపై కూడా కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసిందనే వార్తలు వచ్చాయ్..ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, రాజ్యాంగంలో కల్పించిన అధికారాలను పూర్తి స్థాయిలో  ఉపయోగించుకుని ఉమ్మడి రాజధానిలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవ్వరి పని వారుచేసుకొనేలా చూడాలని తమను కలిసిన గవర్నర్ కు చెప్పినట్లు సమాచారం. గవర్నర్ ఢిల్లీ టూర్ తర్వాత అటు చంద్రబాబు నాయుడు, ఇటు కేసీఆర్ లతో సమావేశమవుతారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఇది జరగలేదు. 

ఫోన్ ట్యాపింగ్ అంశంతోపాటు ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలకు సంబంధించి గవర్నర్ అధికారాలపై ఏపీ మంత్రులు గురి పెట్టారు. సెక్షన్ -8 ను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై గవర్నర్ సలహాదారులు ఏపీ సీఎం చంద్రబాబును కూడా కలిశారు. ఓటుకు నోటు కేసు అంశంతో కొంత టీఫెన్స్ లో పడిన ఏపీ సీఎం చంద్రబాబు ఎదురుదాడితో  టీఆర్ఎస్ సర్కార్ ఖంగుతింది. సెక్షన్ - 8, ట్యాపింగ్ అంశంపై తెలంగాణ మంత్రులు దాటవేసే ధోరణిలోనే మాట్లాడారు. ట్యాపింగ్ జరగలేదని...చంద్రబాబు అవినీతి అంశాన్ని పక్కదారి పట్టించేందుకే ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారని ఎదురుదాడి చేశారు. అంతేకాదు ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి టీఆర్ఎస్ సర్కార్ కూలిపోయేంతటి ఆధారాలను తాము సేకరించామని ఏపీ మంత్రులు మరో కౌంటర్ ఇచ్చారు. వీరిమాటలకు వంతపాడుతూ తెలంగాణ టీడీపీ నేత కొత్తకోట దయాకర్ రెడ్డి...మరికొన్ని గంటల్లో ఓ సంచలనం చోటుచేసుకోబోతుందని ప్రకటించారు. ట్యాపింగ్ కు సంబంధించి ఐదుగురు ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల పాత్రపై ఆధారాలు దొరికాయని వారిని తర్వలోనే అరెస్టు చేస్తారని తెలిపారు.

అయితే తెలంగాణ సర్కార్...ఏపీ మంత్రుల హెచ్చరికలకు తనదైన శైలీలో కౌంటర్ ఇచ్చింది. రాత్రికి రాత్రే ఇద్దరు టీడీపీ నేతలకు నోటీసులు జారీ చేసింది. ఆ వెంటనే ఎంపీ సీఎం రమేశ్ ను సైతం అరెస్టు చేస్తారనే పుకార్లు సైతం జోరుగా షికారు చేశాయ్. అయితే బుధవారానికి సీన్ రివర్స్ అయ్యింది. అరెస్టు చేస్తారనుకున్న వేం నరేందర్ రెడ్డిని ఏసీబీ అధికారులు వదిలివేశారు. 

మరోవైపు ఓటుకు నోటు టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి కేసులో ఫిర్యాదు దారుడు స్టీఫెన్‌సన్‌ వాంగ్మూలాన్ని సెక్షన్‌ 164 ఈఆర్‌సీసీ ప్రకారం బుధవారం కోర్టులో నమోదు చేశారు. నాంపల్లి కోర్టులో మూడో అదనపు మెట్రో పాలిటన్‌ మెజిస్ర్టేట్‌... స్టీఫెన్‌సన్‌ వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. స్టీఫెన్‌సన్‌తో పాటు ఆయన కుమార్తె జెస్సీకా, స్నేహితుడు మార్క్‌ టేలర్‌ వాంగ్మూలాన్ని కూడా మెజిస్ర్టేట్‌ నమోదు చేశారు. 

ఇటు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ కేసుపై దృష్టి పెట్టింది. ఈ కేసు దర్యాప్తును చివరివరకూ కొనసాగించాలని సూచిస్తూ ఎన్నికల సంఘం లేఖ పంపింది. పూర్తి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆ లేఖలో ఈసీ సూచించింది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రధానాధికారిగా ఉన్న భన్వర్‌లాల్‌ ఈ కేసుకు సంబంధించి పంపిన లేఖకు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రతిస్పందిస్తూ ఈ తాజా లేఖ పంపింది. 

e-max.it: your social media marketing partner

బద్దలైన కాంగ్రెస్ కోట

ప్రతిష్ఠాత్మక హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. ఆ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి ఎవరూ ఊహించన...

మహారాష్ట్ర ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ

హైదరాబాద్: త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర...

బలవంతపు భూ సేకరణ జీవోను రద్దు చేయండి... సీఎం జగన్ కు ఎమ్మెల్యే లేఖ

గుంటూరు: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబు ప్రభుత్వం జారీ చేస...

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం...

పశ్చిమగోదావరి: జిల్లాలోని పోడూరు మండలం కవిటం గ్రామంలో దారుణం జరిగింది. తన ప్రేమను ఒప్పుకోలేదని ఓ యువతిపై ప్రేమ...

యూనియన్ల విష కౌగిలి నుంచి బయట పడితేనే... -సీఎం కేసీఆర్

ఆర్టీసీ యూనియన్ల విష కౌగిలి నుంచి బయటపడిప్పుడే కార్మికులకు భవిష్యత్తు అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. కార్మికులు...

నేను కాదు... ఆర్టీసీని ఎవరూ కాపాడలేరు -కేసీఆర్

ఈ దేశంలో తెలంగాణయే కాదు... ఏ ఆర్టీసీని కూడా ఎవరూ కాపాడలేరని కుండబద్దలు కొట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్.

అమెరికాలో ‘హౌడీ మోదీ’ హీట్...

అమెరికాలో ‘హౌడీ మోదీ’ హీట్...

హౌస్టన్: ‘హౌడీ మోదీ’ మెగా ఈవెంట్‌కు రంగం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో హౌస్టన్ వేదికగా 'హౌడీ మోదీ' ఈవెంట్ ప్రా...

ట్రంప్ తో మోడీ కీలక భేటీ...

ఫ్రాన్స్: చర్చల ద్వారానే భారత్ - పాక్ దేశాలు సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఫ్రాన్స...

తెలంగాణ సీఎస్ కి, ఆర్టీసీ ఎండీకి.. బీసీ కమిషన్‌ నోటీసులు

ఢిల్లీ: ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సీఎస్ ఎస్‌కే జోషి, ఆర్టీసీ ఎండీకి జాతీయ బీసీ కమిషన్ నోటీసులు పంపింది. వ్యక్తిగ...

మహారాష్ట్ర, హర్యానలో ముగిసిన ఎన్నికల ప్రచారం...

మహారాష్ట్ర, హర్యానలో ముగిసిన ఎన్నికల ప్రచారం...

ముంబై: మహారాష్ట్ర, హర్యాన అసెంబ్లీ ఎన్నికలకు నేటి సాయంత్రంతో ప్రచారం ముగిసింది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ నియో...

మంచిర్యాలలో NIA సోదాలు...

మంచిర్యాల: జిల్లా నడిబొడ్డున NIA అధికారులు ఆకస్మిక సోదాలు చేశారు. నిన్న(శుక్రవారం) మంచిర్యాల బస్ స్టాండ్ ఎదురు...

తెలంగాణ బంద్ ప్రశాంతం... పలుచోట్ల రాళ్ల దాడి

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన రాష్ట్రబంద్ నేతల అరెస్టులతో పలు చోట్ల ఉద్రిక్తంగా మారింది. బంద్...

పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 175...

'సైరా' చూడండి... గవర్నర్ కి మెగాస్టార్ విన్నపం

'సైరా' చూడండి... గవర్నర్ కి మెగాస్టార్ విన్నపం

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసైసౌందర్ రాజన్ తో మెగాస్టార్ చిరంజీవి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాను నటించిన...

రోహిత్ శర్మ సెంచరీ... పటిష్ట స్థితిలో భారత్

రోహిత్ శర్మ సెంచరీ... పటిష్ట స్థితిలో భారత్

రాంచీ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. తొలి టెస్ట్ రెండు ఇన్నింగ...

మూడో టెస్టులో ఆచూతూచి ఆడుతున్న భారత్...

మూడో టెస్టులో ఆచూతూచి ఆడుతున్న భారత్...

రాంచీ: సౌతాఫ్రికాతో రాంచీలో జరుగుతున్న మూడవ (చివరి) టెస్టులో భారత్ తడబడింది. తొలి రెండు టెస్టుల్లో సెంచరీలతో ర...

హైటెక్స్‌లో మూడు రోజుల పాటు ట్రెడా ప్రాపర్టీ షో...

హైదరాబాద్‌: నగరంలోని మాదాపూర్ హైటెక్స్‌లో ట్రెడా ప్రాపర్టీ షోని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఈ రోజు ప్రారంభిం...

ఆర్థిక రంగానికి ఊతం... కొత్త ఆర్ధిక సంస్కరణలు: నిర్మలా సీతారామన్

ఢిల్లీ: దేశంలో ఆర్ధిక వృద్ధి ఆశించిన స్థాయిలోనే ఉందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆర్ధిక మాంద్...