కాంగ్రెస్ సీనియ‌ర్  నేత జానారెడ్డి రాజ‌కీయాల‌ నుంచి తప్పుకొవాలనుకుంటున్నారా. కాంగ్రెస్ లోఆయ‌న‌కు ప్రాధాన్యం త‌గ్గడమే దీనికి కారణమా? రాజ‌కీయాల్లో నైతిక విలువ‌లు ప‌త‌న‌మ‌య్యాయ‌న్న ఆవేద‌న‌ చెందుతున్నారా? లేదంటే... త‌న వార‌సుణ్ణి రాజ‌కీయ ఆరంగ్రేట్రం చేయించాలని భావిస్తున్నారా?

 

కాంగ్రెస్ సీనియర నేత, మాజీ హోం మంత్రి, సీఎల్పీ నాయకుడు కుందూరు జానారెడ్డికి... రాజకీయల్లో అపార అనుభవం ఉంది. వ్యక్తిగతంగా వివాదాలకు దూరంగా ఉండే జానా రెడ్డి... పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అనేక కీలక ప‌ద‌వుల‌ను పొందారు. తెలంగాణలో అన్ని పార్టీల నేత‌లు... ఆయ‌న‌ను పెద్దమ‌నిషిగా గౌరవిస్తారు. సీఎం కేసీఆర్ సైతం... జానారెడ్డి మాటకు విలువ ఇస్తారు. అయితే... సొంత పార్టీలో మాత్రం జానా అంటే  బోల్డంత వ్యతిరేకత ఉంది.  

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థి ఆకుల లలిత గెలిచిన తర్వాత ఆ క్రెడిట్‌ తనకే వస్తుందని జానా రెడ్డి భావించారు. కానీ అలా జరగలేదు. కొన్ని నెలలుగా పార్టీ అంతర్గత వ్యవహారాలతో అసంతృప్తిగానే ఉంటున్న జానా .... రేవంత్‌ వ్యవహారంతో తన మనసులోని బాధను వెళ్ళగక్కుకున్నారు. రాజకీయాల నుండి రిటైర్‌ కావాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అసలు ఎప్పుడూ శాంతంగా ఉండే జానారెడ్డికి ఏమైంది. ఆయన అసహనానికి కారణం ఏమిటి? పార్టీలో తనకు ప్రాధాన్యం తగ్గిపోతోందని ఆవేదన చెందుతున్నారా? లేక తన వారసుణ్ణి రంగంలోకి దించేందుకు వ్యూహాత్మకంగా వ్యవ‌హ‌రిస్తున్నారా అనేది స్పష్టం కావాల్సి ఉంది. 

వాస్తవానికి కొన్ని నెలలుగా కాంగ్రెస్‌ పార్టీలో చర్చంతా జానారెడ్డి పైనే. సార్వత్రిక ఎన్నికల తర్వాత సీఎల్పీ నాయకుడిగా జానారెడ్డి బాధ్యతలు స్వీకరించిన త‌ర్వాత... ఆయన వవ‌హార‌శైలిపై ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా అధికారపక్షాన్ని దీటుగా ఎదుర్కోవాల్సిన జానా..... అసెంబ్లీలో అవకాశం దొరికినా సత్తా చాటలేకపోతున్నారని కాంగ్రెస్ కొత్త ఎమ్మెల్యేలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

అధికారపార్టీ తప్పులను ఎండగడుతూ ముందుకెళ్ళాలని పీసీసీ చీఫ్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌,  ఎమ్మెల్యేలందరు  డిసైడ్ చేసుకున్నా... జానా తీరు మారలేదని టీ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. బడ్జెట్‌పై ప్రభుత్వాన్ని ఏకిపారేస్తారని ఆశించిన ఎమ్మెల్యేలకు జానా తీరు ఇబ్బంది గా  తయారైందని అప్పట్లో అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్యేలు గుసగుసలాడుకున్నారు. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త పోరాడుతుంటే ......నాయకుడిగా ముందుండి నడిపించాల్సిన జానారెడ్డి అసెంబ్లీలోనూ, బయటా మెతకవైఖరి ప్రదర్శించి పరువు తీస్తున్నారని పార్టీ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. 

సీఎల్పీ నాయకుడిగా దూకుడుగా వ్యవహరించట్లేదన్న కారణంగా జానారెడ్డిని పార్టీ వ్యవహారాల్లో గత కొన్ని నెలలుగా దాదాపు దూరం పెట్టేశారు. పీసీసీ అధ్యక్షుడి సొంత జిల్లాకు చెందిన వ్యక్తిగా జానారెడ్డి ఉన్నప్పటికీ ఆయనకు తెలియకుండానే చాలా విషయాలు జరుగుతున్నాయన్న ప్రచారం ఎక్కువగా వినిపిస్తోంది. దీంతో తననెవరూ పట్టించుకోవట్లేదని జానారెడ్డి తన అనుచరుల  దగ్గర వాపోయారని పార్టీ వర్గాల కథనం. పార్టీలోని అంతర్గత విషయాలతో విసిగివేసారిన జానారెడ్డి ఇక గౌరవంగా పదవీ నుండి తప్పుకొవాడమే మంచిది అనుకుంటున్నట్లు తెలుస్తోంది..

మ‌రోవైపు కుమారుడిని క్రియాశీల రాజ‌కీయాల్లోకి తీసుకురావాల‌ని జానారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. మొద‌ట న‌ల్గోండ జిల్లాలో త‌న వార‌సుడికి రాజ‌కీయంగా గ‌ట్టి పునాదుల‌ు వేసి....ఆ త‌ర్వాత పిసిసి స్థాయిలో మంచి స్థానాన్ని క‌ల్పించాల‌ని వ్యూహాత్మకంగా పావులు క‌దుపుతున్నట్లు తెలుస్తోంది.

e-max.it: your social media marketing partner

బద్దలైన కాంగ్రెస్ కోట

ప్రతిష్ఠాత్మక హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. ఆ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి ఎవరూ ఊహించన...

మహారాష్ట్ర ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ

హైదరాబాద్: త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర...

బలవంతపు భూ సేకరణ జీవోను రద్దు చేయండి... సీఎం జగన్ కు ఎమ్మెల్యే లేఖ

గుంటూరు: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబు ప్రభుత్వం జారీ చేస...

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం...

పశ్చిమగోదావరి: జిల్లాలోని పోడూరు మండలం కవిటం గ్రామంలో దారుణం జరిగింది. తన ప్రేమను ఒప్పుకోలేదని ఓ యువతిపై ప్రేమ...

యూనియన్ల విష కౌగిలి నుంచి బయట పడితేనే... -సీఎం కేసీఆర్

ఆర్టీసీ యూనియన్ల విష కౌగిలి నుంచి బయటపడిప్పుడే కార్మికులకు భవిష్యత్తు అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. కార్మికులు...

నేను కాదు... ఆర్టీసీని ఎవరూ కాపాడలేరు -కేసీఆర్

ఈ దేశంలో తెలంగాణయే కాదు... ఏ ఆర్టీసీని కూడా ఎవరూ కాపాడలేరని కుండబద్దలు కొట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్.

అమెరికాలో ‘హౌడీ మోదీ’ హీట్...

అమెరికాలో ‘హౌడీ మోదీ’ హీట్...

హౌస్టన్: ‘హౌడీ మోదీ’ మెగా ఈవెంట్‌కు రంగం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో హౌస్టన్ వేదికగా 'హౌడీ మోదీ' ఈవెంట్ ప్రా...

ట్రంప్ తో మోడీ కీలక భేటీ...

ఫ్రాన్స్: చర్చల ద్వారానే భారత్ - పాక్ దేశాలు సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఫ్రాన్స...

తెలంగాణ సీఎస్ కి, ఆర్టీసీ ఎండీకి.. బీసీ కమిషన్‌ నోటీసులు

ఢిల్లీ: ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సీఎస్ ఎస్‌కే జోషి, ఆర్టీసీ ఎండీకి జాతీయ బీసీ కమిషన్ నోటీసులు పంపింది. వ్యక్తిగ...

మహారాష్ట్ర, హర్యానలో ముగిసిన ఎన్నికల ప్రచారం...

మహారాష్ట్ర, హర్యానలో ముగిసిన ఎన్నికల ప్రచారం...

ముంబై: మహారాష్ట్ర, హర్యాన అసెంబ్లీ ఎన్నికలకు నేటి సాయంత్రంతో ప్రచారం ముగిసింది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ నియో...

మంచిర్యాలలో NIA సోదాలు...

మంచిర్యాల: జిల్లా నడిబొడ్డున NIA అధికారులు ఆకస్మిక సోదాలు చేశారు. నిన్న(శుక్రవారం) మంచిర్యాల బస్ స్టాండ్ ఎదురు...

తెలంగాణ బంద్ ప్రశాంతం... పలుచోట్ల రాళ్ల దాడి

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన రాష్ట్రబంద్ నేతల అరెస్టులతో పలు చోట్ల ఉద్రిక్తంగా మారింది. బంద్...

పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 175...

'సైరా' చూడండి... గవర్నర్ కి మెగాస్టార్ విన్నపం

'సైరా' చూడండి... గవర్నర్ కి మెగాస్టార్ విన్నపం

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసైసౌందర్ రాజన్ తో మెగాస్టార్ చిరంజీవి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాను నటించిన...

రోహిత్ శర్మ సెంచరీ... పటిష్ట స్థితిలో భారత్

రోహిత్ శర్మ సెంచరీ... పటిష్ట స్థితిలో భారత్

రాంచీ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. తొలి టెస్ట్ రెండు ఇన్నింగ...

మూడో టెస్టులో ఆచూతూచి ఆడుతున్న భారత్...

మూడో టెస్టులో ఆచూతూచి ఆడుతున్న భారత్...

రాంచీ: సౌతాఫ్రికాతో రాంచీలో జరుగుతున్న మూడవ (చివరి) టెస్టులో భారత్ తడబడింది. తొలి రెండు టెస్టుల్లో సెంచరీలతో ర...

హైటెక్స్‌లో మూడు రోజుల పాటు ట్రెడా ప్రాపర్టీ షో...

హైదరాబాద్‌: నగరంలోని మాదాపూర్ హైటెక్స్‌లో ట్రెడా ప్రాపర్టీ షోని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఈ రోజు ప్రారంభిం...

ఆర్థిక రంగానికి ఊతం... కొత్త ఆర్ధిక సంస్కరణలు: నిర్మలా సీతారామన్

ఢిల్లీ: దేశంలో ఆర్ధిక వృద్ధి ఆశించిన స్థాయిలోనే ఉందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆర్ధిక మాంద్...