విజయవాడ: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తమ పార్టీ నేతలతో ఈరోజు నుంచి వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు జనసేన
పార్టీ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. ఈ సమావేశాల్లో ముఖ్యంగా త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ప్రధానంగా చర్చిన్చానుండి. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రణాళికల గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు పలు సూచనలు చేయనున్నారు. అలాగే, ప్రస్తుతం రాష్ట్రంలో నేతలు పార్టీలు మారుతుండడంతో మారుతున్న నేతలపై పవన్ ప్రత్యేక దృష్టి సారించే విషయాలను కూడా ప్రస్తావించనున్నారని తెలిసింది.