ఢిల్లీ: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ రాజీనామా ప్రతిపాదనను సీడబ్ల్యూసీ సభ్యులు తిరస్కరించారు. ఇటీవల వెలువడ్డ సార్వత్రిక ఎన్నికల్లో దారుణ ఓటమిపై
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సభ్యులు ఈరోజు సుమారు నాలుగు గంటల పాటు లోతుగా చర్చించారు. అయితే... సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ తీసుకున్న రాజీనామా నిర్ణయం పట్ల సీనియర్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. వారితో పాటు రాహుల్ తల్లి, యుపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ కూడా రాహుల్ రాజీనామాను తిరస్కరించారు. సమావేశం అనంతరం సీడబ్ల్యూసీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ... ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని అలాగే... నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. రాహుల్ రాజీనామా ప్రతిపాదనను సీడబ్ల్యూసీ సభ్యులు ఏకగ్రీవంగా తిరస్కరించారని... పార్టీ పునర్నిర్మాణ బాధ్యతలను రాహుల్కే అప్పగించామని... అతని నాయకత్వంలోనే పార్టీ ముందుకెళ్తుందని కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశంలో పేర్కొన్నారు.