ఓ వైపు సెక్షన్ - 8, గవర్నర్ అధికారాలపై జగడం ఇంకా సద్దుమణగనే లేదు...తాజాగా విభజన చట్టం 9,10 షెడ్యూల్ లో ఉన్న సంస్థలపై ఇరు రాష్ట్రాల మధ్య సరికొత్త లొల్లి మొదలైంది. అంతేకాదు విభజన సమస్యల పరిష్కారానికి తెలంగాణ సీఎంతో చర్చించేందుకు తాను సిద్ధమని ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ప్రకటించారు..! మరి ఇద్దరు సీఎంలోను కూర్చోబెట్టి సమస్యలను పరిష్కారానికి గవర్నర్ నరసింహన్ చొరవ చూపుతారా? 

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని 10వ షెడ్యుల్ లో పేర్కొన్న 107 సంస్థలపై పెత్తనం కోసం ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య మళ్లీ రగడ మొదలైంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటి నుంచి సంవత్సరంలోగా ఈ సంస్థలపై ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రావాలని...విభజన చట్టంలో నిర్దేశించారు. ఈ 107 సంస్థల సేవలను ఇరు రాష్ట్రాలు ఎలా ఉపయోగించుకోవాల్సింది విభజన చట్టం సెక్షన్ 75 కింద పేర్కొన్నారు.  తాజాగా హైదరాబాద్ లో ఉన్న సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డైరెక్టర్ జనరల్ గా తమ రాష్ట్రానికి చెందిన ఓ ఐఏఎస్ అధికారిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఉన్నతా విద్యమండలిపై హైకోర్టు తీర్పును  అనుసరించి 10వ షెడ్యూల్ లో పేర్కొన్న సంస్థలు ఏ రాష్ట్ర భూభాగంలో ఉంటే ఆ రాష్ట్రానికే అధికారం ఉంటుందని..వాటి నిర్వహణ, అధికారుల నియామకం, అజమాయిషీ అంతా ఆ రాష్ట్రాలకే ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ లెక్క ప్రకారం షెడ్యూల్ 10లో ఉన్న 97 సంస్థల నిర్వహణ తమ దేనని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. దీంతో ఈ షెడ్యూల్ లోని సంస్థలపై మళ్లీ వివాదం మొదలైంది. తెలంగాణ ప్రభుత్వం ఈ షెడ్యూల్ లో ఉన్న సంస్థలకు సంబంధించిన సమీక్ష సమావేశం కూడా నిర్వహించింది. 

అటు 9 ,10 షెడ్యూల్‌ సంస్థలపై తెలంగాణ ప్రభుత్వం వ్యవహారిస్తున్న తీరుపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన సమస్యలపై కలిసి కూర్చుని మాట్లాడుకుందామని తెలంగాణ సీఎంకు తాను విజ్ఞప్తి చేసినా కూడా తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన అన్నారు. ఇద్దరం కలిసి కూర్చుంటే ఆమోదయోగ్యమైన పరిష్కారం వస్తుందని బాబు అభిప్రాయపడ్డారు. 

మరోవైపు  విభజన సమస్యలపై తాను ఇప్పటికి 23 సార్లు గవర్నర్‌ను కలిశానని అయినా ఎటువంటి ఫలితం లేకుండా పోయిందని  ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాలంటే తెలంగాణ ప్రభుత్వానికి ఇసుమంతైనా గౌరవంలేదని విమర్శించారు. విభజన చట్టంపై తెలంగాణ ప్రభుత్వం వితండవాదం చేస్తోందని, లక్షలాదిమంది విద్యార్థులతో ఆటలాడుతోందని అన్నారు. శత్రుదేశం కూడా ఇలా చేయదని గంటా వ్యాఖ్యానించారు. సెక్షన్-8 కూడా అమలు చేయకుంటే హైదరాబాద్‌ను యూటీ చేయాల్సిన పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు. 

ఇప్పటికైనా గవర్నర్ తనకున్న విశేషాధికారులను ఉపయోగించి విభజన సమస్యల పరిష్కారానికి చొరవ చూపాల్సిన అవసరం ఉంది.  గతంలో విభజన సమస్యల  పరిష్కారానికి రాజ్ భవన్ వేదికగా ఇద్దరు సీఎంలను కలిపిన గవర్నర్ నరసింహన్ మరోసారి ఇద్దరు చంద్రులను కలపాలని ప్రజలు కోరుతున్నారు. 

 

e-max.it: your social media marketing partner

బద్దలైన కాంగ్రెస్ కోట

ప్రతిష్ఠాత్మక హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. ఆ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి ఎవరూ ఊహించన...

మహారాష్ట్ర ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ

హైదరాబాద్: త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర...

బలవంతపు భూ సేకరణ జీవోను రద్దు చేయండి... సీఎం జగన్ కు ఎమ్మెల్యే లేఖ

గుంటూరు: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబు ప్రభుత్వం జారీ చేస...

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం...

పశ్చిమగోదావరి: జిల్లాలోని పోడూరు మండలం కవిటం గ్రామంలో దారుణం జరిగింది. తన ప్రేమను ఒప్పుకోలేదని ఓ యువతిపై ప్రేమ...

యూనియన్ల విష కౌగిలి నుంచి బయట పడితేనే... -సీఎం కేసీఆర్

ఆర్టీసీ యూనియన్ల విష కౌగిలి నుంచి బయటపడిప్పుడే కార్మికులకు భవిష్యత్తు అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. కార్మికులు...

నేను కాదు... ఆర్టీసీని ఎవరూ కాపాడలేరు -కేసీఆర్

ఈ దేశంలో తెలంగాణయే కాదు... ఏ ఆర్టీసీని కూడా ఎవరూ కాపాడలేరని కుండబద్దలు కొట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్.

అమెరికాలో ‘హౌడీ మోదీ’ హీట్...

అమెరికాలో ‘హౌడీ మోదీ’ హీట్...

హౌస్టన్: ‘హౌడీ మోదీ’ మెగా ఈవెంట్‌కు రంగం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో హౌస్టన్ వేదికగా 'హౌడీ మోదీ' ఈవెంట్ ప్రా...

ట్రంప్ తో మోడీ కీలక భేటీ...

ఫ్రాన్స్: చర్చల ద్వారానే భారత్ - పాక్ దేశాలు సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఫ్రాన్స...

తెలంగాణ సీఎస్ కి, ఆర్టీసీ ఎండీకి.. బీసీ కమిషన్‌ నోటీసులు

ఢిల్లీ: ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సీఎస్ ఎస్‌కే జోషి, ఆర్టీసీ ఎండీకి జాతీయ బీసీ కమిషన్ నోటీసులు పంపింది. వ్యక్తిగ...

మహారాష్ట్ర, హర్యానలో ముగిసిన ఎన్నికల ప్రచారం...

మహారాష్ట్ర, హర్యానలో ముగిసిన ఎన్నికల ప్రచారం...

ముంబై: మహారాష్ట్ర, హర్యాన అసెంబ్లీ ఎన్నికలకు నేటి సాయంత్రంతో ప్రచారం ముగిసింది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ నియో...

మంచిర్యాలలో NIA సోదాలు...

మంచిర్యాల: జిల్లా నడిబొడ్డున NIA అధికారులు ఆకస్మిక సోదాలు చేశారు. నిన్న(శుక్రవారం) మంచిర్యాల బస్ స్టాండ్ ఎదురు...

తెలంగాణ బంద్ ప్రశాంతం... పలుచోట్ల రాళ్ల దాడి

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన రాష్ట్రబంద్ నేతల అరెస్టులతో పలు చోట్ల ఉద్రిక్తంగా మారింది. బంద్...

పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 175...

'సైరా' చూడండి... గవర్నర్ కి మెగాస్టార్ విన్నపం

'సైరా' చూడండి... గవర్నర్ కి మెగాస్టార్ విన్నపం

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసైసౌందర్ రాజన్ తో మెగాస్టార్ చిరంజీవి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాను నటించిన...

రోహిత్ శర్మ సెంచరీ... పటిష్ట స్థితిలో భారత్

రోహిత్ శర్మ సెంచరీ... పటిష్ట స్థితిలో భారత్

రాంచీ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. తొలి టెస్ట్ రెండు ఇన్నింగ...

మూడో టెస్టులో ఆచూతూచి ఆడుతున్న భారత్...

మూడో టెస్టులో ఆచూతూచి ఆడుతున్న భారత్...

రాంచీ: సౌతాఫ్రికాతో రాంచీలో జరుగుతున్న మూడవ (చివరి) టెస్టులో భారత్ తడబడింది. తొలి రెండు టెస్టుల్లో సెంచరీలతో ర...

హైటెక్స్‌లో మూడు రోజుల పాటు ట్రెడా ప్రాపర్టీ షో...

హైదరాబాద్‌: నగరంలోని మాదాపూర్ హైటెక్స్‌లో ట్రెడా ప్రాపర్టీ షోని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఈ రోజు ప్రారంభిం...

ఆర్థిక రంగానికి ఊతం... కొత్త ఆర్ధిక సంస్కరణలు: నిర్మలా సీతారామన్

ఢిల్లీ: దేశంలో ఆర్ధిక వృద్ధి ఆశించిన స్థాయిలోనే ఉందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆర్ధిక మాంద్...