సెక్షన్ -8 అమలును ఒప్పుకునేది లేదు..! అవసరమైతే జాతీయ స్థాయిలో పోరాడుతామని తెలంగాణ మంత్రులు ఒకింత హెచ్చరిక స్వరంతోనే చెబుతున్నారు...!

మరోవైపు సెక్షన్- 8 లేదంటే అసలు విభజననే ఒప్పుకొమంటున్నారు ఏపీ మంత్రులు...? ఇంతకీ గవర్నర్ స్టాండ్ ఏమిటీ? రాష్ట్ర విభజన జరిగిన ఏడాది అయ్యింది. రెండు రాష్ట్రాల్లో కూడా తొలి అవతరణ దినోత్సవాలు ఘనంగానే జరిగాయ్. అయితే ఈ ఏడాది పాలనలో కాలంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు కామన్ అయ్యాయి. ఉమ్మడి ఎంసెట్ తో మొదలైన వివాదాలు ఆ తర్వాత ఇతర అంశాలకు పాకాయ్. నీరు వివాదం...తీరు వివాదం.. పేరు వివాదం..విద్యుత్ వివాదం...! ఒకటేమిటి అడుగు తీసి అడుగు వేస్తే వివాదాలే..! ఉమ్మడి అంశాలపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలపై కూడా వివాదాలు...వాటిపై పరస్పర విమర్శలు...వాదోపవాదాలు నిత్యకృత్యంగా మారాయ్. కలిసి మెలిసి సాగాల్సిన రెండు ప్రభుత్వాలు మా వాదన కరెక్టు అంటే  మా వాదన కరెక్టు అంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నాయ్. ఒక దశలో సాగర్ ప్రాజెక్టు వద్ద ఇరు రాష్ట్రాల పోలీసులు బాహబాహీకి దిగిన ఘటనలు కూడా జరిగాయ్. ఈ పంచాయితీలను పలు మార్లు, గవర్నర్ వద్దకు అటు కేంద్రం వద్దకు ఇటు న్యాయస్థానాల ముందుకు తీసుకువెళ్తేగాని సద్దుమణగడం లేదు..! 

ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు సమన్యాయం చేయాల్సిన గవర్నర్...ఒకింత తెలంగాణకు అనుకూలంగా వ్యవహారిస్తున్నారని పలు మార్లు ఏపీ మంత్రులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. తమ అభ్యంతరాలను బుట్టదాఖలు చేస్తూ...తెలంగాణకు వంతపాడుతున్నారని ఆరోపించారు. గవర్నర్ తీరుతో ఉన్న సమస్యలు పరిష్కారం కాకపోగా సరికొత్త సమస్యలకు ఉత్పన్నమవుతున్నాయని వాపోతున్నారు.

తాజాగా ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అరెస్టు, చంద్రబాబు టేపులు విడుదల కావడంతో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం తారస్థాయికి చేరింది. ఏపీ సీఎం చంద్రబాబు....తెలంగాణ సీఎం తీరుపై ఫైర్ అయ్యారు. ఉమ్మడి రాజధానిలో తమ ఫోన్లను...ఎలాంటి అనుమతులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం ట్యాపింగ్ చేయడం నేరమని తెలిపారు. రాజధానిలో తమ కదలికలపై నిఘా వేస్తున్నారని కేంద్రానికి ఫిర్యాదు కూడా చేశారు. ఇప్పటికే ఈ ట్యాపింగ్ లపై కేంద్రం కూడా అంతర్గత విచారణకు ఆదేశించింది. ట్యాపింగ్ లకు సంబంధించిన పూర్తి ఆధారాలను సైతం ఏపీ సీఎం కేంద్రానికి అందించారు. అంతేకాదు చంద్రబాబు మాట్లాడినట్లుగా చెబుతున్న టేపులను మొదట ప్రసారం చేసిన ఓ చానల్ కు ఏపీ పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పై నమోదు అయిన కేసులపై సిట్ ను కూడా ఏర్పాటు చేశారు. ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా అంతే దూకుడుగా ఓటుకు నోటు కేసులు ముందుకు వెళుతోంది. తాజాగా ఏపీ ప్రభుత్వం సెక్షన్ -౮ అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఉమ్మడి రాజధానిలో తమకు రక్షణ లేదని...తమ ఫోన్ లు ట్యాపింగ్ చేస్తున్నారని వెంటనే సెక్షన్ ఎనిమిదిని అమలు చేయలని డిమాండ్ చేస్తున్నారు. ఇటు గవర్నర్ తీరుపై కూడా ఏపీ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఏపీ ప్రభుత్వం విమర్శలు ఎలా ఉన్న గవర్నర్ మాత్రం తాను చట్టప్రకారమే తన విధులు నిర్వహిస్తున్నానని చెబుతున్నారు. శుక్రవారం నాడు ఢిల్లీలో హోంశాఖ ఉన్నతాధికారులతో  జరిగిన భేటీలో కూడా సెక్షన్ -8 అంశంపై చర్చ జరిగినట్లు చెబుతున్నారు. ఈ సెక్షన్ ద్వారా సక్రమించిన విశేషాధికారులకు ఉపయోగించి పరిస్థితులు చక్కదిద్దే అవకాశమున్నా కూడా ప్రతి అంశానికి గవర్నర్ ఢిల్లీ వెపు చూడడం ఏమిటని...ఢిల్లీ పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. 

 

e-max.it: your social media marketing partner

బద్దలైన కాంగ్రెస్ కోట

ప్రతిష్ఠాత్మక హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. ఆ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి ఎవరూ ఊహించన...

మహారాష్ట్ర ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ

హైదరాబాద్: త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర...

బలవంతపు భూ సేకరణ జీవోను రద్దు చేయండి... సీఎం జగన్ కు ఎమ్మెల్యే లేఖ

గుంటూరు: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబు ప్రభుత్వం జారీ చేస...

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం...

పశ్చిమగోదావరి: జిల్లాలోని పోడూరు మండలం కవిటం గ్రామంలో దారుణం జరిగింది. తన ప్రేమను ఒప్పుకోలేదని ఓ యువతిపై ప్రేమ...

యూనియన్ల విష కౌగిలి నుంచి బయట పడితేనే... -సీఎం కేసీఆర్

ఆర్టీసీ యూనియన్ల విష కౌగిలి నుంచి బయటపడిప్పుడే కార్మికులకు భవిష్యత్తు అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. కార్మికులు...

నేను కాదు... ఆర్టీసీని ఎవరూ కాపాడలేరు -కేసీఆర్

ఈ దేశంలో తెలంగాణయే కాదు... ఏ ఆర్టీసీని కూడా ఎవరూ కాపాడలేరని కుండబద్దలు కొట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్.

అమెరికాలో ‘హౌడీ మోదీ’ హీట్...

అమెరికాలో ‘హౌడీ మోదీ’ హీట్...

హౌస్టన్: ‘హౌడీ మోదీ’ మెగా ఈవెంట్‌కు రంగం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో హౌస్టన్ వేదికగా 'హౌడీ మోదీ' ఈవెంట్ ప్రా...

ట్రంప్ తో మోడీ కీలక భేటీ...

ఫ్రాన్స్: చర్చల ద్వారానే భారత్ - పాక్ దేశాలు సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఫ్రాన్స...

తెలంగాణ సీఎస్ కి, ఆర్టీసీ ఎండీకి.. బీసీ కమిషన్‌ నోటీసులు

ఢిల్లీ: ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సీఎస్ ఎస్‌కే జోషి, ఆర్టీసీ ఎండీకి జాతీయ బీసీ కమిషన్ నోటీసులు పంపింది. వ్యక్తిగ...

మహారాష్ట్ర, హర్యానలో ముగిసిన ఎన్నికల ప్రచారం...

మహారాష్ట్ర, హర్యానలో ముగిసిన ఎన్నికల ప్రచారం...

ముంబై: మహారాష్ట్ర, హర్యాన అసెంబ్లీ ఎన్నికలకు నేటి సాయంత్రంతో ప్రచారం ముగిసింది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ నియో...

మంచిర్యాలలో NIA సోదాలు...

మంచిర్యాల: జిల్లా నడిబొడ్డున NIA అధికారులు ఆకస్మిక సోదాలు చేశారు. నిన్న(శుక్రవారం) మంచిర్యాల బస్ స్టాండ్ ఎదురు...

తెలంగాణ బంద్ ప్రశాంతం... పలుచోట్ల రాళ్ల దాడి

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన రాష్ట్రబంద్ నేతల అరెస్టులతో పలు చోట్ల ఉద్రిక్తంగా మారింది. బంద్...

పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 175...

'సైరా' చూడండి... గవర్నర్ కి మెగాస్టార్ విన్నపం

'సైరా' చూడండి... గవర్నర్ కి మెగాస్టార్ విన్నపం

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసైసౌందర్ రాజన్ తో మెగాస్టార్ చిరంజీవి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాను నటించిన...

రోహిత్ శర్మ సెంచరీ... పటిష్ట స్థితిలో భారత్

రోహిత్ శర్మ సెంచరీ... పటిష్ట స్థితిలో భారత్

రాంచీ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. తొలి టెస్ట్ రెండు ఇన్నింగ...

మూడో టెస్టులో ఆచూతూచి ఆడుతున్న భారత్...

మూడో టెస్టులో ఆచూతూచి ఆడుతున్న భారత్...

రాంచీ: సౌతాఫ్రికాతో రాంచీలో జరుగుతున్న మూడవ (చివరి) టెస్టులో భారత్ తడబడింది. తొలి రెండు టెస్టుల్లో సెంచరీలతో ర...

హైటెక్స్‌లో మూడు రోజుల పాటు ట్రెడా ప్రాపర్టీ షో...

హైదరాబాద్‌: నగరంలోని మాదాపూర్ హైటెక్స్‌లో ట్రెడా ప్రాపర్టీ షోని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఈ రోజు ప్రారంభిం...

ఆర్థిక రంగానికి ఊతం... కొత్త ఆర్ధిక సంస్కరణలు: నిర్మలా సీతారామన్

ఢిల్లీ: దేశంలో ఆర్ధిక వృద్ధి ఆశించిన స్థాయిలోనే ఉందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆర్ధిక మాంద్...