ఇది తెలుగు రాష్ట్రాల అంతులేని కథ..! విభజన జరిగి ఏడాది గడిచింది..! జగడాలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయ్..! ఓటుకు నోటు కేసు, చంద్రబాబు టేపులతో మొదలైనా వివాదం....

ఆ తర్వాత పలు మలుపులు తిరిగి ఉమ్మడి రాజధానిలో ఫోన్ ట్యాపింగ్  తెరపైకి వచ్చింది. తాజాగా సెక్షన్ -8, గవర్నర్ అధికారాలపై రచ్చ జరుగుతోంది.!ఉమ్మడి గవర్నర్ గా రెండు రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన గవర్నర్ నరసింహన్ తెలంగాణ అంటే కొంచెం మక్కువ చూపిస్తున్నారని...ఏపీ మంత్రులు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. గవర్నర్ వ్యవహారశైలిపై రెండు వారాల క్రితం ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా గవర్నర్ నరసింహన్ ఆకస్మికంగా ఢిల్లీకి వెళ్లి వచ్చారు. ఢిల్లీ పర్యటన విశేషాల గురించి విలేకరులు  గుచ్చిగుచ్చి ప్రశ్నించగా తాను చెప్పడానికేమి లేదని నరసింహన్ దాటవేశారు. సెక్షన్ -౮,సహా యాదాతథస్థితి కొనసాగుతుందని ఆయన ముక్తయించారు. అంతకు మించి పెదవి విప్పడానికి గవర్నర్ నిరాకరించారు. గవర్నర్ మాటరాని మౌనం..! ఇదే ఇవాళ్టి బిగ్ స్టోరీ. 

గవర్నర్ అంటే...అటు కేంద్రానికి ఇటు రాష్ట్రానికి వారధి..! అంతేకాదు రాజ్యాంగ ప్రతినిధి..! ఆ రాష్ట్రానికి మొదటి పౌరుడు కూడా..! ఇక అసలు విషయానికి వస్తే.., ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్  గా నరసింహన్ ది పెద్ద బాధ్యత...! విభజన సమస్యలను పరిష్కారించాల్సిన ఆయన మౌన ప్రేక్షకుడిగా మారిపోయారా..? ప్రతి విషయానికి ఢిల్లీబాట పడుతున్నారా?

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఓటుకు నోటు వ్యవహారం...అంతులేని, ముగింపునకు చేరని తెలుగు టీవీ సీరియల్ లా అనంతంగా కొనసాగుతూనేవున్నది.

ఉభయ రాష్ట్రాల్లో రాజకీయ నాయకుల దృష్టంతా ప్రస్తుతం ఈ అంశంపైనే. దర్యాప్తు సంస్థలపై వీరికి విశ్వాసంవున్నట్లు కనిపించదు..! అంతిమంగా న్యాయస్థానాలకు కూడా రాజకీయ మకిలిని అంటించడానికి వీరు శతవిధాల యత్నిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో నెలకొనివున్న ప్రశాంత పరిస్థితులు వీరికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయ్. తెలుగు ప్రజలు కొట్టుకు చస్తుంటేనే వీరికి కళ్ళు చల్లబడేటట్టున్నాయ్. కాని ఆ ప్రజలు  విచక్షణాయుతమయిన, విజ్ఞతతో కూడిన తీర్పే తమనీ స్థాయిలో వుంచిందన్న కనీస స్పృహ వీరికి కొరవడడం తెలుగు ప్రజల దురదృష్టం. 

ఈ వరుస వివాదాల నేపథ్యంలో ఉభయ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇ.ఎస్.ఎల్ నరసింహన్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన సర్వత్రా ఉత్కంఠ రేకెత్తించింది. దిశా నిర్దేశం కోసం ఆయనను ఢిల్లీ....పిలిపించారని ఓ వైపు ప్రచారం...కాదు కాదు గవర్నర్ నే మార్చేస్తున్నారంటూ మరోవైపు ఊహగానాలు, అన్నింటికీ తెర దించుతూ నరసింహన్ ఢిల్లీ వెళ్లను వెళ్లారు.  హైదరాబాద్ కు  తిరిగి రానూ వచ్చారు. విభజనంలోని సెక్షన్ 8 సహా అన్ని సమస్యలను పరిష్్కరించవలసిన బాధ్యత గవర్నర్దేనని ఢిల్లీ పెద్దలు ఆయనకు స్పష్టీకరించినట్లు  సమాచారం. 

తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలను తమ వరకు తీసుకు రావద్దని సాధ్యమయినంత వరకు వాటిని స్థానికంగానే పరిష్కరించుకోవాలని, తద్వారా ఉభయ రాష్ట్రాల్లో సుహృద్భావ పూర్వకమయిన స్నేహపూరిత వాతావరణం నెలకొనేలా చూడవలసిన గురుతర బాధ్యత గవర్నర్ దేనని హితవచనాలు కూడా పలికినట్లు వినికిడి. 

అటు రెండు వారాల క్రితమే ఢిల్లీ వచ్చిన నరసింహన్...అప్పట్లో ఇద్దరు సీఎంలతో భేటీ అవుతారని భావించారు. ఓటుకు నోటు కేసు తర్వాత ఉత్పన్నమైన అన్ని వివాదాలకు ఓ  పరిష్కారం కనుగోంటారని కేంద్ర పెద్దలు భావించారు. ఈ సమస్యలను ఇలాగే నాన్చడంతో కొత్త సమస్యలు తలెత్తున్నాయని  కేంద్ర పెద్దలు...ఆయనపై ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.! 

హోంశాఖ వర్గాలతో భేటీ తర్వాత...విలేకరులు ప్రశ్నించిన ఆయన ముక్తసరి సమాధానాలతోనే ప్రశ్నలను దాటవేశారు. ఇంతకీ గవర్నర్ మౌనం వీడేది ఎప్పుడు..! రాజ్యాంగ ప్రతినిధిగా...రాష్ట్రాధిపతిగా....తెలుగు రాష్ట్రాల సమస్యలు పరిష్కరించేది ఎప్పుడని ప్రజలు ఎదురు చూస్తున్నారు.!

 

e-max.it: your social media marketing partner

బద్దలైన కాంగ్రెస్ కోట

ప్రతిష్ఠాత్మక హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. ఆ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి ఎవరూ ఊహించన...

మహారాష్ట్ర ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ

హైదరాబాద్: త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర...

బలవంతపు భూ సేకరణ జీవోను రద్దు చేయండి... సీఎం జగన్ కు ఎమ్మెల్యే లేఖ

గుంటూరు: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబు ప్రభుత్వం జారీ చేస...

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం...

పశ్చిమగోదావరి: జిల్లాలోని పోడూరు మండలం కవిటం గ్రామంలో దారుణం జరిగింది. తన ప్రేమను ఒప్పుకోలేదని ఓ యువతిపై ప్రేమ...

యూనియన్ల విష కౌగిలి నుంచి బయట పడితేనే... -సీఎం కేసీఆర్

ఆర్టీసీ యూనియన్ల విష కౌగిలి నుంచి బయటపడిప్పుడే కార్మికులకు భవిష్యత్తు అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. కార్మికులు...

నేను కాదు... ఆర్టీసీని ఎవరూ కాపాడలేరు -కేసీఆర్

ఈ దేశంలో తెలంగాణయే కాదు... ఏ ఆర్టీసీని కూడా ఎవరూ కాపాడలేరని కుండబద్దలు కొట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్.

అమెరికాలో ‘హౌడీ మోదీ’ హీట్...

అమెరికాలో ‘హౌడీ మోదీ’ హీట్...

హౌస్టన్: ‘హౌడీ మోదీ’ మెగా ఈవెంట్‌కు రంగం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో హౌస్టన్ వేదికగా 'హౌడీ మోదీ' ఈవెంట్ ప్రా...

ట్రంప్ తో మోడీ కీలక భేటీ...

ఫ్రాన్స్: చర్చల ద్వారానే భారత్ - పాక్ దేశాలు సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఫ్రాన్స...

తెలంగాణ సీఎస్ కి, ఆర్టీసీ ఎండీకి.. బీసీ కమిషన్‌ నోటీసులు

ఢిల్లీ: ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సీఎస్ ఎస్‌కే జోషి, ఆర్టీసీ ఎండీకి జాతీయ బీసీ కమిషన్ నోటీసులు పంపింది. వ్యక్తిగ...

మహారాష్ట్ర, హర్యానలో ముగిసిన ఎన్నికల ప్రచారం...

మహారాష్ట్ర, హర్యానలో ముగిసిన ఎన్నికల ప్రచారం...

ముంబై: మహారాష్ట్ర, హర్యాన అసెంబ్లీ ఎన్నికలకు నేటి సాయంత్రంతో ప్రచారం ముగిసింది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ నియో...

మంచిర్యాలలో NIA సోదాలు...

మంచిర్యాల: జిల్లా నడిబొడ్డున NIA అధికారులు ఆకస్మిక సోదాలు చేశారు. నిన్న(శుక్రవారం) మంచిర్యాల బస్ స్టాండ్ ఎదురు...

తెలంగాణ బంద్ ప్రశాంతం... పలుచోట్ల రాళ్ల దాడి

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన రాష్ట్రబంద్ నేతల అరెస్టులతో పలు చోట్ల ఉద్రిక్తంగా మారింది. బంద్...

పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 175...

'సైరా' చూడండి... గవర్నర్ కి మెగాస్టార్ విన్నపం

'సైరా' చూడండి... గవర్నర్ కి మెగాస్టార్ విన్నపం

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసైసౌందర్ రాజన్ తో మెగాస్టార్ చిరంజీవి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాను నటించిన...

రోహిత్ శర్మ సెంచరీ... పటిష్ట స్థితిలో భారత్

రోహిత్ శర్మ సెంచరీ... పటిష్ట స్థితిలో భారత్

రాంచీ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. తొలి టెస్ట్ రెండు ఇన్నింగ...

మూడో టెస్టులో ఆచూతూచి ఆడుతున్న భారత్...

మూడో టెస్టులో ఆచూతూచి ఆడుతున్న భారత్...

రాంచీ: సౌతాఫ్రికాతో రాంచీలో జరుగుతున్న మూడవ (చివరి) టెస్టులో భారత్ తడబడింది. తొలి రెండు టెస్టుల్లో సెంచరీలతో ర...

హైటెక్స్‌లో మూడు రోజుల పాటు ట్రెడా ప్రాపర్టీ షో...

హైదరాబాద్‌: నగరంలోని మాదాపూర్ హైటెక్స్‌లో ట్రెడా ప్రాపర్టీ షోని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఈ రోజు ప్రారంభిం...

ఆర్థిక రంగానికి ఊతం... కొత్త ఆర్ధిక సంస్కరణలు: నిర్మలా సీతారామన్

ఢిల్లీ: దేశంలో ఆర్ధిక వృద్ధి ఆశించిన స్థాయిలోనే ఉందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆర్ధిక మాంద్...