స్మార్ట్...వెరీ వెరీ స్మార్ట్...! ఎక్కడ చూసినా అందమైన పచ్చిక బైళ్లు...చెట్లు... పచ్చదనం..! ఎత్తైన భవనాలు, గతుకులు లేని విశాలమైన రోడ్లు...! పార్కింగ్ కూడా పక్కా ప్లాన్ ప్రకారమే..! జస్ట్.. ఓ స్మార్ట్ ఫోన్ తోనే అన్ని పనులు స్మార్ట్ గా జరిగిపోయేలా డిజిటల్ వ్యవస్థ...! ఇంకా చెప్పాలంటే అదో నవలోకం..మన కోసం వెలుస్తోంది..! 

 

దేశంలోని నగరాలను...పట్టణాలను స్మార్ట్  సిటీలుగా తీర్చిదిద్దే సరికొత్త కార్యక్రమానికి కేంద్రంలోని మోడీ సర్కార్ శ్రీకారం చుట్టింది..! అంతేకాదు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని నగరాలను కూడా ఈ పథకం కోసం ఎంపిక చేశారు..! 

అందమే ఆనందం...! ఆనందమే జీవిత మకరందమన్నాడు ఓ సినీ కవి..! మన ఇల్లు...! మన చుట్టు ఉండే పరిసరాలు...! మన ఊరు...! మన నగరం కూడా అందంగా మారిపోతే ఎంత బాగుంటుంది..! ఈ అందమైన కలను నిజం చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ సంకల్పించారు..!

స్మార్ట్ నగరాలు...ప్రధాన మంత్రి  నరేంద్రమోడీ స్వప్నం..! ఈ స్వప్నాన్ని సాకారం చేసేందుకు ఆయన నడుం కట్టారు. అటల్‌ మిషన్‌ ఫర్‌ రిజువనేషన్‌ అండ్‌ అర్బన్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌.... అమృత్, తోపాటు అందరికీ ఇళ్లు , స్మార్ట్ సిటీస్ మిషన్....పథకాలకు గురువారం అంకురార్పణ చేశారు. 

‘స్మార్ట్‌ సిటీ’ అంటే కొత్తగా నగరాలను నిర్మించరు. ఉన్న నగరాలనే ‘స్మార్ట్‌’గా మారుస్తారు. నిర్దిష్ట అర్హతలున్న నగరాలనే స్మార్ట్‌ సిటీల కోసం ఎంపిక చేస్తారు. ఈ నగరాల్లో పర్యావరణ అనుకూల ఇంధన వినియోగానికి, నిర్మాణాలకు ప్రోత్సాహమిస్తారు. సమాచార, సాంకేతిక పరిజ్ఞానానికి పెద్దపీట వేస్తారు. పౌరులకు ‘జవాబుదారీ’గా ఉంటూ సేవలు అందిస్తారు. ప్రజలకు భద్రత, భరోసా ఉండేలా చర్యలు తీసుకుంటారు. స్మార్ట్‌ సిటీకి అయ్యే ఖర్చులో 40 శాతం కేంద్రం అందిస్తుంది. 50 శాతం రాష్ట్రాలు భరించాలి. మిగిలిన 10 శాతాన్ని పీపీపీ పద్ధతిలో సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.48 వేల కోట్లు.

ఈ అమృత్ కార్యక్రమంలో పలువురు కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మేయర్లు, ఛైర్పర్సన్లు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. 

దేశంలో ఎన్నడూ లేని రీతిలో భాగస్వామ్య పక్షాలతో విస్తృత చర్చలు జరిపి ఈ పథకాలను రూపొందించామని, కేంద్ర, రాష్ట్రాలు కలిసికట్టుగా వీటిని ముందుకు తీసుకెళ్లాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. పోటీ పడి నిర్దిష్ట ప్రమాణాలను సాధించిన నగరాలనే స్మార్ట్‌ సిటీలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పటి వరకు పట్టణీకరణకు సమగ్ర దృక్పథం కొరవడిందని, పట్టణాల విస్తరణను ఇప్పటి వరకు పాలకులు కాకుండా రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లు నిర్దేశించారని, కానీ, దానిని నిర్ణయించాల్సింది అక్కడి ప్రజలు, నాయకత్వమేనని చెప్పారు. 

అంతేకాదు స్మార్ట్ కు  పీఎం మోడీ తనదైన నిర్వచనం ఇచ్చారు. దేశ ప్రజల ఆకాంక్షలకు ఎప్పుడు రెండడుగుల ముందుండటమే స్మార్ట్ అని ఆయన అభివర్ణించారు. టెక్నాలజీ, రవాణ సౌకర్యాలు,  విద్యుత్ , కార్మికుల పని విధానంలో స్మార్ట్ పద్ధతుల్ని తీసుకురావాల్సి ఉందనేది ప్రధాని అభిప్రాయం. ప్రస్తుతం దేశంశోల చాలా మంది ఉద్యోగులు తమ ఆఫీసులకు వెళ్లేందుకు ఎక్కువ సమయం ప్రయాణిస్తున్నారని...ఆఫీసుల్లో తక్కువ సమయం గడుపుతున్నారని....ప్రతి ఒక్కరు నడిచి ఆఫీసుకు వెళ్లేలా రవాణా సౌకర్యాల ఏర్పాటుతోపాటు టెక్నాలజీకి పెద్దపీట వేయాలని పీఎం సూచించారు. 

అటు పట్టణాల్లో చెత్త నుంచి కంపోస్టు ఎరువు తయారు చేసి గ్రామాల్లో ఆర్గానిక్‌ పద్ధతిలో కూరగాయలు పండించేలా చర్యలు చేపడతామని ప్రధాని అన్నారు. నిధుల కొరత లేకుండా కేంద్ర, రాష్ట్రాలు నమూనా తయారు చేయాలని, పీపీపీ పద్ధతిలో, ఎఫ్‌డీఐల రూపంలో నిధులు సమకూరుతాయని వివరించారు. ఈ సందర్భంగా కర్ణాటకలో సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, ఛత్తీస్ గఢ్‌ బహిర్భూమి నిర్మూలనకు అమలు చేస్తున్న విధానాలను కొనియాడారు. ఆస్తి పన్ను వసూలు విషయంలో జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్  ఇచ్చిన ప్రజెంటేషన్ ను పీఎం మెచ్చుకున్నారు. మిగతా నగరాలు కూడా చిత్తశుద్ధితో ప్రజామోదిత పథకాలతో ఈ తరహా లక్ష్యాలను అధిగమించవచ్చునని ఆయన అన్నారు. 

తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ నుంచి మొత్తం ఐదు నగరాలను ఈ పథకాల అమలు కోసం ఎంపిక చేశారు. తెలంగాణలో హైదరాబాద్ , వరంగల్ నగరాలు ఉండగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవాడ, విశాఖపట్నం తిరుపతి నగరాలు ఎంపిక అయ్యాయి. 

 

e-max.it: your social media marketing partner

బద్దలైన కాంగ్రెస్ కోట

ప్రతిష్ఠాత్మక హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. ఆ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి ఎవరూ ఊహించన...

మహారాష్ట్ర ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ

హైదరాబాద్: త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర...

బలవంతపు భూ సేకరణ జీవోను రద్దు చేయండి... సీఎం జగన్ కు ఎమ్మెల్యే లేఖ

గుంటూరు: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబు ప్రభుత్వం జారీ చేస...

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం...

పశ్చిమగోదావరి: జిల్లాలోని పోడూరు మండలం కవిటం గ్రామంలో దారుణం జరిగింది. తన ప్రేమను ఒప్పుకోలేదని ఓ యువతిపై ప్రేమ...

యూనియన్ల విష కౌగిలి నుంచి బయట పడితేనే... -సీఎం కేసీఆర్

ఆర్టీసీ యూనియన్ల విష కౌగిలి నుంచి బయటపడిప్పుడే కార్మికులకు భవిష్యత్తు అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. కార్మికులు...

నేను కాదు... ఆర్టీసీని ఎవరూ కాపాడలేరు -కేసీఆర్

ఈ దేశంలో తెలంగాణయే కాదు... ఏ ఆర్టీసీని కూడా ఎవరూ కాపాడలేరని కుండబద్దలు కొట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్.

అమెరికాలో ‘హౌడీ మోదీ’ హీట్...

అమెరికాలో ‘హౌడీ మోదీ’ హీట్...

హౌస్టన్: ‘హౌడీ మోదీ’ మెగా ఈవెంట్‌కు రంగం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో హౌస్టన్ వేదికగా 'హౌడీ మోదీ' ఈవెంట్ ప్రా...

ట్రంప్ తో మోడీ కీలక భేటీ...

ఫ్రాన్స్: చర్చల ద్వారానే భారత్ - పాక్ దేశాలు సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఫ్రాన్స...

తెలంగాణ సీఎస్ కి, ఆర్టీసీ ఎండీకి.. బీసీ కమిషన్‌ నోటీసులు

ఢిల్లీ: ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సీఎస్ ఎస్‌కే జోషి, ఆర్టీసీ ఎండీకి జాతీయ బీసీ కమిషన్ నోటీసులు పంపింది. వ్యక్తిగ...

మహారాష్ట్ర, హర్యానలో ముగిసిన ఎన్నికల ప్రచారం...

మహారాష్ట్ర, హర్యానలో ముగిసిన ఎన్నికల ప్రచారం...

ముంబై: మహారాష్ట్ర, హర్యాన అసెంబ్లీ ఎన్నికలకు నేటి సాయంత్రంతో ప్రచారం ముగిసింది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ నియో...

మంచిర్యాలలో NIA సోదాలు...

మంచిర్యాల: జిల్లా నడిబొడ్డున NIA అధికారులు ఆకస్మిక సోదాలు చేశారు. నిన్న(శుక్రవారం) మంచిర్యాల బస్ స్టాండ్ ఎదురు...

తెలంగాణ బంద్ ప్రశాంతం... పలుచోట్ల రాళ్ల దాడి

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన రాష్ట్రబంద్ నేతల అరెస్టులతో పలు చోట్ల ఉద్రిక్తంగా మారింది. బంద్...

పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 175...

'సైరా' చూడండి... గవర్నర్ కి మెగాస్టార్ విన్నపం

'సైరా' చూడండి... గవర్నర్ కి మెగాస్టార్ విన్నపం

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసైసౌందర్ రాజన్ తో మెగాస్టార్ చిరంజీవి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాను నటించిన...

రోహిత్ శర్మ సెంచరీ... పటిష్ట స్థితిలో భారత్

రోహిత్ శర్మ సెంచరీ... పటిష్ట స్థితిలో భారత్

రాంచీ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. తొలి టెస్ట్ రెండు ఇన్నింగ...

మూడో టెస్టులో ఆచూతూచి ఆడుతున్న భారత్...

మూడో టెస్టులో ఆచూతూచి ఆడుతున్న భారత్...

రాంచీ: సౌతాఫ్రికాతో రాంచీలో జరుగుతున్న మూడవ (చివరి) టెస్టులో భారత్ తడబడింది. తొలి రెండు టెస్టుల్లో సెంచరీలతో ర...

హైటెక్స్‌లో మూడు రోజుల పాటు ట్రెడా ప్రాపర్టీ షో...

హైదరాబాద్‌: నగరంలోని మాదాపూర్ హైటెక్స్‌లో ట్రెడా ప్రాపర్టీ షోని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఈ రోజు ప్రారంభిం...

ఆర్థిక రంగానికి ఊతం... కొత్త ఆర్ధిక సంస్కరణలు: నిర్మలా సీతారామన్

ఢిల్లీ: దేశంలో ఆర్ధిక వృద్ధి ఆశించిన స్థాయిలోనే ఉందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆర్ధిక మాంద్...