అబుదాబి: రెండు రోజుల పర్యటనలో భాగంగా యూఏఈలో పర్యటిస్తోన్న ప్రధాని మోడీకి అరుదైన గౌరవం దక్కింది. యూఏఈ యువరాజు మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్
ఈ రోజు మోడీని 'ఆర్డర్ ఆఫ్ జాయెద్' అనే అత్యున్నత మెడల్తో సత్కరించారు. దేశాల అధ్యక్షులు, ప్రధానులు, రాజులకు బహూకరించే ఈ అవార్డు యూఏఈలోనే అత్యున్నత పౌర పురస్కారం. భారత్, యూఏఈ దేశాల మధ్య ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ప్రధాని మోడీ చేసిన కృషికి గానూ ఈ అవార్డును అందజేశారు. కాగా... ఈ మెడల్ ను ఇంతకుముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్, బ్రిటన్ రాణి ఎలిజబెత్, సాదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ తదితరులు అందుకున్నారు.