హైదరాబాద్: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మృతిపట్ల ఐక్యరాజ్య సమితిలో 51 దేశాల దౌత్యవేత్తలు
నివాళులర్పించారు. ఈ రోజు న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో సుష్మా ఫోటోకు నివాళులర్పించి అనంతరం అక్కడున్న పుస్తకంలో సంతాప సందేశం రాశారు. ఇదో గొప్ప విషయమని పేర్కొంటూ యూఎన్లోని భారత అంబాసిడర్ సయీద్ అక్బరుద్దీన్ ట్వీట్ చేశారు. 2014 నుంచి 2019 వరకు కేంద్ర మంత్రి వర్గంలో విదేశాంగ శాఖ మంత్రిగా సుష్మా స్వరాజ్ సేవలందించిన విషయం విదితమే.
కాగా... సంతాపం సందేశం తెలిపిన దేశాలు.. రష్యా, జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా, ఇటలీ, స్విట్జర్లాండ్, అర్జెంటీనా, బహ్రెయిన్, బంగ్లాదేశ్, భూటాన్, బోట్స్వానా, దక్షిణ కొరియా, ఈజిప్ట్, ఫిజి, జార్జియా, ఘానా, కెన్యా, మలేషియా, మాల్దీవులు, మల్టా, మయన్మార్, నేపాల్, న్యూజిలాండ్, సింగపూర్, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్, ఇజ్రాయెల్, యూఏఈతో పాటు పలు దేశాలు ఉన్నాయి.