ఢిల్లీ: శ్రీలంకలో ఈరోజు జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటనపై కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించారు. కొలంబోలో తమ వారి
పరిస్థితుల వివరాలు తెలుసుకునేందుకు హెల్ప్ లైన్ నెంబర్లను సుష్మ కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. ఈ దాడి ఘటనపై కొలంబోలోని భారత హైకమిషనర్తో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆమె తెలిపారు. బాంబు పేలుళ్లపై అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, స్థానికంగా ఉన్న భారతీయులు అత్యవసర సాయానికి, సమాచారానికి కొలంబోలోని భారత హై కమిషనర్ కార్యాలయంలో సంప్రదించాల్సిందిగా సూచించారు. శ్రీలంక భారతీయ హెల్ప్ లైన్ నెంబర్లు: 94777903082, 94112422788, 94112422789, 94112422789 ప్రకటిస్తూ... ఆమె ట్వీట్ చేశారు.