అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారింది. ఈ తుపానుకు 'అశోభ' అని పేరు పెట్టారు. తుపాను ప్రభావంతో ఒమన్ నుంచి పాకిస్థాన్ వరకు ఉన్న తీరప్రాంతాన్ని అప్రమత్తం చేశారు.
ఈ వారాంతంలో ఇది తీరాన్ని తాకుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. తుపాను ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, సుడిగాలులు రావచ్చని హెచ్చరిస్తున్నారు. సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించారు.