ఢిల్లీ: దివంగత.. భారత మాజీ రాష్ట్రపతి, ప్రఖ్యాత శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం జాతి గర్వించదగ్గ వ్యక్తి అంటూ కొనియాడారు ప్రధాని మోదీ. ఈ రోజు కలాం జయంతి
సందర్భంగా ప్రధాని ట్విట్టర్ ద్వారా కలాం చేసిన కృషిని స్మరించుకున్నారు. రక్షణ రంగంలో కలాం చేసిన కృషి ఎన్నటికీ మరిచిపోలేమన్నారు. రాష్ట్రపతిగా ఆయన దేశానికి చేసిన సేవలు ఆదర్శనీయమని కొనియాడారు. ఎంత ఉన్నతమైన స్థానాలు అధిరోహించినప్పటికీ... ఆయన సాధారణ జీవితం గడిపారనీ, వ్యక్తిగతంగా ఎలాంటి ఆస్తులు సంపాదించుకోలేదని పేర్కొన్నారు. పుస్తకాలే ఆయన ఆస్తి అన్న మోదీ... ఆయనను కలుసుకున్న క్షణాలు ఇప్పటికీ నా మనసులో పదిలంగా ఉన్నాయన్నారు.