హైదరాబాద్: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్(ఎల్సీఏ) యుద్ధ విమానం 'తేజస్' పరీక్ష విజయవంతమయ్యింది. దీన్ని డీఆర్డీవో, ఏరోనాటికల్
డెవలప్మెంట్ ఏజెన్సీలు తయారు చేశాయి. తేజస్ ను త్వరలో నేవీలో ప్రవేశపెట్టనున్నట్లు నిపుణులు తెలిపారు. స్వల్ప దూరం నుంచే తేజస్ను భూమిపై సురక్షితంగా ల్యాండ్ చేయడం ముఖ్యమైన అంశం. ప్రస్తుత పరీక్షలో తేజస్ ఆ సామర్థ్యాన్ని ప్రదర్శించినట్లు నిపుణులు చెప్పారు. గోవాలోని టెస్ట్ సెంటర్లో ఈ రోజు తేజస్కు ఈ పరీక్ష నిర్వహించారు. దీన్ని యుద్ధ నౌకపై వినియోగించనున్నారు.