హైదరాబాద్: ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద రావు ఆత్మహత్యకు ముందు చివరి కాల్ ఎవరికి చేసింది పోలీసులు బయటపెట్టారు. కోడెల కాల్ డేటా ఆధారంగా గుర్తించిన పోలీసులు తన చివరి కాల్
బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్ సుమతికి చేసినట్టు వెల్లడించారు. కోడెల శివప్రసాద్ 20 రోజుల కిందట హైదరాబాద్ వచ్చినట్లు తేల్చిన పోలీసులు, ఆత్మహత్య చేసుకోవాలని ముందుగానే నిర్ణయించుకున్నట్లు భావిస్తున్నారు. ఈ కేసులో కోడెల కూతురు, భార్య గన్ మెన్ డ్రైవర్ తోపాటు మరో నలుగురిని ప్రత్యక్ష సాక్షులు గా పోలీసులు పేర్కొన్నారు. కోడెల కొడుకు శివరాంతో మాకు ఎలాంటి సంబంధం లేదని, కోడెల యగ్జైటీకి గల కారణాలు తెలుసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. టెక్నీకల్ అవిడెన్స్ ద్వారానే కేసును పరిష్కరిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.