కేశవరెడ్డి స్కూల్స్... ఓ బడా కార్పొరేట్ స్కూల్స్ చైన్...  పదుల ఎకరాల్లో క్యాంపస్ లు... పెద్ద పెద్ద బిల్డింగ్ లు.. ఆధునిక వసతులంటూ అకడమిక్ ఇయర్ ప్రారంభంలో ఏ పేపర్ చూసినా...టీవీ ఛానల్ ట్యూన్ చేసినా  ఈ స్కూల్ ప్రకటనలే భారీగా కనిపిస్తాయి.

మరి ఇంత పెద్ద విద్యా సంస్థను ప్రారంభించాలంటే ఎవరైనా సహజంగా  కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలనేది అందరూ కాదనలేని నిజం. కానీ కేశవరెడ్డి విద్యాసంస్థలు ఎలా ఎదిగాయో...ఎవరి డబ్బులతో బ్రాంచ్ ల మీద బ్రాంచ్ లు స్థాపించారో తెలుసుకుంటే బడా బడా ఆర్థికవేత్తలకే ఆశ్చర్యం వేయక మానదు.

ఒక సంస్థను ప్రారంభించి... ఆ సంస్థ మార్కెట్లో ఎదుగుతూ అందరి మన్ననలు పొందితే ....తిరిగి ఆ సంస్థను విస్తరించాలనుకుంటే ఏ పెట్టుబడిదారైనా తమ దగ్గరున్న మూల ధనాన్ని ఉపయోగిస్తారు. లేదంటే తమ సంస్థ షేర్లను అమ్మి పెట్టుబడులు సేకరిస్తారు. ఇది పెట్టుబడుల సేకరణలో కనీస వ్యాపార సూత్రం. ఇందుకోసం అవసరమైన అన్ని అనుమతులు ఆ సంస్థలకు తప్పనిసరి. కాని కేశవరెడ్డి స్కూల్స్ మాత్రం తమ విద్యాసంస్థల విస్తరణకు తప్పుడు పంథాను ఎంచుకుంది. ఎలాంటి అనుమతులు లేకుండా ఆర్థిక అవకతవకలకు పాల్పడింది. ఈ స్కూళ్లో చదివిన విద్యార్ధుల తల్లిదండ్రులు... సీవీఆర్ న్యూస్ కి ఇచ్చిన ఫిర్యాదుతో కేశవరెడ్డి ఆర్ధిక అవకతవకల భాగోతం బయటపడింది.

మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం కంది గ్రామంలో ఐదేళ్లక్రితం కేశవరెడ్డి విద్యాసంస్థలను ప్రారంభించారు. ఈ స్కూళ్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు నిర్వహిస్తున్నారు. ఇక సంగారెడ్డిలోని కేశవరెడ్డి పాఠశాలలో సుమారు 1400 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 400మందికి పైగా బోర్డింగ్ విద్యార్థులు కాగా, మిగతా విద్యార్థులు డేస్కాలర్స్. అడ్మిషన్ల సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక ఆఫర్ పేరుతో ఒక అనధికారిక స్కీంను  పాఠశాల యాజమాన్యం ప్రవేశపెట్టింది. దీని ప్రకారం హాస్టల్లో జాయిన్ అయ్యే విద్యార్థి ....మొదట మూడు లక్షల రూపాయలు చెల్లించాలి. డే స్కాలర్ విద్యార్థి అయితే రెండు లక్షల రూపాయల చెల్లించాలి. ఇలా ఒక్కసారి చెల్లిస్తే  విద్యార్ధి... పాఠశాలలో చదివినన్ని రోజులు ఉచితంగా పుస్తకాలు, యూనిఫాంతో పాటు బోర్డింగ్... ఉచిత హాస్టల్ సదుపాయం కల్పిస్తామని పాఠశాల యజమాన్యం తెలిపింది.

విద్యార్థి పాఠశాల నుంచి వెళ్లిపోయేటప్పుడు  పేరెంట్స్ ఇచ్చిన మొత్తం అంటే హాస్టల్ విద్యార్థులు చెల్లించిన మూడు లక్షలు, డేస్కాలర్ విద్యార్థులు చెల్లించిన రెండు లక్షల తిరిగి ఇస్తామనేది పాఠశాల యజమాన్యం ఒప్పందం. ఇందుకోసం డబ్బులు చెల్లించిన పేరెంట్స్ కు  కళాశాల యజమాని కేశవరెడ్డి.... విద్యార్ధుల తల్లిదండ్రుల నుంచి అప్పు తీసుకున్నట్లుగా ఒక ప్రామిసరీ నోట్ ను అందించారు. అంటే విద్యార్థి చదువుకున్నంత కాలం పేరెంట్స్ ఇచ్చిన మొత్తానికి వచ్చిన వడ్డీతో విద్యార్థులు ఫ్రీగా చదువుకుంటారనేది పాఠశాల ప్రచారం చేసిన పథకం ఉద్దేశ్యం. ఆర్థికంగా కొంచెం స్థితిమంతులైనవారు ఈ వడ్డీ పథకానికి ఆకర్షితులయ్యారు. అసలుకు అసలు మిగులుతుంది. వడ్డీతో విద్యార్థులు చదువుతారన్న ఆశతో  వందలాది విద్యార్థుల తల్లిదండ్రులు లక్షలు వెచ్చించి  తమ పిల్లలను ఇందులో చేర్పించారు. ఇలా  విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి... కేవలం సంగారెడ్డి  బ్రాంచి నుండే ... ఈ ఐదేళ్లలో సుమారు 30కోట్లు అక్రమంగా  విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కేశవరెడ్డి యాజమాన్యం రాబట్టింది.  

కేశవరెడ్డి స్కూల్స్ లో ఇంత తంతు జరుగుతున్నా విద్యాశాఖ అధికారులకు ఎలాంటి సమాచారం లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇంతవరకు గుట్టుగా ఈ వ్యవహారాన్ని కొనసాగించి కేశవరెడ్డి యజమాన్యం...కొందరు పేరెంట్స్ కు డబ్బులు తిరిగి ఇవ్వడానికి నిరాకరించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. చదువు పూర్తయిన కొందరి విద్యార్థుల తల్లిదండ్రులు  తాము ఇచ్చి డబ్బులు ఇవ్వమని పాఠశాల యజమాన్యాన్ని అడగగా  రేపు...మాపు అంటూ పాఠశాల చుట్టూ తిప్పుతున్నాయి. తమకు నష్టం వచ్చిందని....ఇచ్చిన మొత్తం నుంచి సగం మినహాయించుకుంటామని విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకువచ్చారని.... లేనిపక్షంలో మీకు దిక్కున్న చోటు చెప్పుకొండని బెదిరించారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరెంట్స్ వచ్చి   పాఠశాలలో ఆందోళన చేస్తుండటంతో కొంత మొత్తాన్ని కేశవరెడ్డి సంస్థలు ఇస్తున్నాయి. మిగతా మొత్తానికి రేపు మాపు అంటూ  తిప్పుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు.  

డిపాజిట్ చేసిన తల్లిదండ్రులు...వందల సంఖ్యలో ఉన్నారు. తమ పిల్లలు ఇంకా అదే పాఠశాల చదువుతుండటంతో ఏమి ఇబ్బందులు వస్తాయోనన్న ఆలోచనలతో చాలామంది పేరెంట్స్ నోరు మెదపడం లేదు. తమ డబ్బులు ఎలా తిరిగి వస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. ఇంత పెద్ద స్థాయిలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డ  కేశవరెడ్డి యజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, పార్టీలు  డిమాండ్ చేస్తున్నాయి.

కేశవరెడ్డి తీరు పూర్తిగా నిబంధనలకు వ్యతిరేకమని మెదక్ జిల్లా విద్యాశాఖాధికారి రాజేశ్వరరావు తెలిపారు.  తన ముఫ్పై ఏళ్ల సర్వీస్ లో ఇలాంటి సేకరణ వినలేదని, కచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.

ఒక్క సంగారెడ్డి బ్రాంచ్ నుంచే అక్రమంగా ముప్పై కోట్ల డిపాజిట్స్ సేకరించిన కేశవరెడ్డికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పదుల సంఖ్యలో బ్రాంచ్ లున్నాయి. అక్కడ  ఎంత డిపాజిట్స్ సేకరించారో విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఇలా చట్టవిరుద్ధంగా నిధుల సేకరణ జరిపిన కేశవరెడ్డి యాజమాన్యంపై ఇరు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని విద్యావేత్తలు డిమాండ్ చేస్తున్నారు.

e-max.it: your social media marketing partner

బద్దలైన కాంగ్రెస్ కోట

ప్రతిష్ఠాత్మక హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. ఆ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి ఎవరూ ఊహించన...

మహారాష్ట్ర ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ

హైదరాబాద్: త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర...

బలవంతపు భూ సేకరణ జీవోను రద్దు చేయండి... సీఎం జగన్ కు ఎమ్మెల్యే లేఖ

గుంటూరు: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబు ప్రభుత్వం జారీ చేస...

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం...

పశ్చిమగోదావరి: జిల్లాలోని పోడూరు మండలం కవిటం గ్రామంలో దారుణం జరిగింది. తన ప్రేమను ఒప్పుకోలేదని ఓ యువతిపై ప్రేమ...

యూనియన్ల విష కౌగిలి నుంచి బయట పడితేనే... -సీఎం కేసీఆర్

ఆర్టీసీ యూనియన్ల విష కౌగిలి నుంచి బయటపడిప్పుడే కార్మికులకు భవిష్యత్తు అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. కార్మికులు...

నేను కాదు... ఆర్టీసీని ఎవరూ కాపాడలేరు -కేసీఆర్

ఈ దేశంలో తెలంగాణయే కాదు... ఏ ఆర్టీసీని కూడా ఎవరూ కాపాడలేరని కుండబద్దలు కొట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్.

అమెరికాలో ‘హౌడీ మోదీ’ హీట్...

అమెరికాలో ‘హౌడీ మోదీ’ హీట్...

హౌస్టన్: ‘హౌడీ మోదీ’ మెగా ఈవెంట్‌కు రంగం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో హౌస్టన్ వేదికగా 'హౌడీ మోదీ' ఈవెంట్ ప్రా...

ట్రంప్ తో మోడీ కీలక భేటీ...

ఫ్రాన్స్: చర్చల ద్వారానే భారత్ - పాక్ దేశాలు సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఫ్రాన్స...

తెలంగాణ సీఎస్ కి, ఆర్టీసీ ఎండీకి.. బీసీ కమిషన్‌ నోటీసులు

ఢిల్లీ: ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సీఎస్ ఎస్‌కే జోషి, ఆర్టీసీ ఎండీకి జాతీయ బీసీ కమిషన్ నోటీసులు పంపింది. వ్యక్తిగ...

మహారాష్ట్ర, హర్యానలో ముగిసిన ఎన్నికల ప్రచారం...

మహారాష్ట్ర, హర్యానలో ముగిసిన ఎన్నికల ప్రచారం...

ముంబై: మహారాష్ట్ర, హర్యాన అసెంబ్లీ ఎన్నికలకు నేటి సాయంత్రంతో ప్రచారం ముగిసింది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ నియో...

మంచిర్యాలలో NIA సోదాలు...

మంచిర్యాల: జిల్లా నడిబొడ్డున NIA అధికారులు ఆకస్మిక సోదాలు చేశారు. నిన్న(శుక్రవారం) మంచిర్యాల బస్ స్టాండ్ ఎదురు...

తెలంగాణ బంద్ ప్రశాంతం... పలుచోట్ల రాళ్ల దాడి

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన రాష్ట్రబంద్ నేతల అరెస్టులతో పలు చోట్ల ఉద్రిక్తంగా మారింది. బంద్...

పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 175...

'సైరా' చూడండి... గవర్నర్ కి మెగాస్టార్ విన్నపం

'సైరా' చూడండి... గవర్నర్ కి మెగాస్టార్ విన్నపం

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసైసౌందర్ రాజన్ తో మెగాస్టార్ చిరంజీవి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాను నటించిన...

రోహిత్ శర్మ సెంచరీ... పటిష్ట స్థితిలో భారత్

రోహిత్ శర్మ సెంచరీ... పటిష్ట స్థితిలో భారత్

రాంచీ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. తొలి టెస్ట్ రెండు ఇన్నింగ...

మూడో టెస్టులో ఆచూతూచి ఆడుతున్న భారత్...

మూడో టెస్టులో ఆచూతూచి ఆడుతున్న భారత్...

రాంచీ: సౌతాఫ్రికాతో రాంచీలో జరుగుతున్న మూడవ (చివరి) టెస్టులో భారత్ తడబడింది. తొలి రెండు టెస్టుల్లో సెంచరీలతో ర...

హైటెక్స్‌లో మూడు రోజుల పాటు ట్రెడా ప్రాపర్టీ షో...

హైదరాబాద్‌: నగరంలోని మాదాపూర్ హైటెక్స్‌లో ట్రెడా ప్రాపర్టీ షోని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఈ రోజు ప్రారంభిం...

ఆర్థిక రంగానికి ఊతం... కొత్త ఆర్ధిక సంస్కరణలు: నిర్మలా సీతారామన్

ఢిల్లీ: దేశంలో ఆర్ధిక వృద్ధి ఆశించిన స్థాయిలోనే ఉందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆర్ధిక మాంద్...