ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా పరిమిత కాల దేశీ టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్ను ప్రకటించింది. దేశీ విమాన టికెట్లను 1,777 రూపాయలకే ప్రయాణికులకు అందిస్తోంది. జూన్ 10 నుంచి 12 మధ్యకాలంలో బుక్ చేసుకున్న టికెట్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది. ఈ ఆఫర్ కింద టికెట్లను బుక్ చేసుకున్న వారు జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఎప్పుడైనా ప్రయాణించవచ్చు.