హైదరాబాద్: పండగ సీజన్ ముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) మంచి శుభవార్త చెప్పింది. గృహరుణాలు, ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది.
రుణ రేట్లను 10 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తూ ఎస్బీఐ ఈ రోజు ప్రకటన విడుదల చేసింది. అందులో భాగంగా కాలపరిమితి ముగిసిన అన్ని టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది.
కాగా... ఈ మధ్య రెపో రేట్లు తగ్గించిన కొన్ని వారాల్లోనే ఎస్బీఐ మరో భారీ నిర్ణయం తీసుకున్నది. ఈ తగ్గించిన కొత్త రేట్లు సెప్టెంబర్ 10వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే... 45 రోజుల్లో మెచూరిటీ పొందే ఎఫ్డీలపై వడ్డీ రేటు మాత్రం 4.5 శాతమే ఉండనుంది. ఇక 180 నుంచి ఏడాది వరకు చేసిన ఎఫ్డీలపై 5.8 శాతం, మూడేళ్ల వరకు ఎఫ్డీలపై 6.35 శాతం ఇంట్రెస్ట్ రేటు ఉంటుంది. స్టేట్ బ్యాంకు దారిలోనే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ఓబీసీ, ఐడీబీఐ, ఐడీఎఫ్సీ బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించాయి.