అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియపై ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్ గా మొత్తం
ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటయింది. ఇప్పటికే ఆర్టీసీ విలీనం, ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపుపై వంటి అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా... ఈ కమిటీ విలీనం ప్రక్రియలో మొత్తం 9 అంశాలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ప్రజా రవాణా వ్యవస్థ ఏర్పాటుపై సూచనలు చేయడం... శాశ్వత ఉద్యోగులు, తాత్కాలిక ఉద్యోగుల జీతభత్యాలపై కమిటీ నివేదిక ఇవ్వనుంది. విలీనం తర్వాత ఆర్టీసీ బిజినెస్ రూల్స్ లో మార్పులు రాకుండా తీసుకివాల్సిన చర్యలపై నివేదికలో పేర్కొననుంది. రిటైర్డ్ ఉద్యోగుల జీతాలు, వైద్య సదుపాయలపై అధికారుల కమిటీ పరిశీలన జరపనుంది. ప్రభుత్వంలో విలీనం చేయడంలో ఉన్న ఆర్ధిక, న్యాయపరమైన అంశాలపై నివేదిక ఇవ్వనుంది. ఈ మేరకు వచ్చే నెలాఖరుకల్లా నివేదిక ఇవ్వాలని కమిటీ కి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.