టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్లో విమర్శలు గుప్పించారు. ‘దొంగే దొంగ అని అరవడం’ చంద్రబాబు గారికి 40 ఏళ్లుగా అలవాటే. వైసీపీ
మహిళా నేతలను అత్యంత నీచమైన భాషతో తిట్టించింది ఆయనే. ఈ రోజు తనే బాధితుడినన్నట్టు కుల మీడియాలో శోకాలు పెడుతున్నాడు. తన వరకు వస్తే బాధేమిటే తెలియలేదు సారుకి.
1982 నుంచి ‘లేనిది ఉన్నట్టు’ రాస్తూ ప్రజలను మభ్య పెట్టిన పచ్చ మీడియా అడ్రసు గల్లంతవుతుందనే భయం పట్టుకుంది చంద్రబాబు గారికి. అందుకే సోషల్ మీడియా పోస్టింగులపై మీడియా కాన్ఫరెన్స్ పెట్టి తన స్థాయిని దిగజార్చుకున్నాడు. తన పాలనలో 600 కేసులు పెట్టి వేధించిన సంగతి ఎవరూ మర్చి పోరు.
అమరావతి ప్రపంచ స్థాయి సిటీ, రెండో టోక్యో అవుతుందని మొన్నటి దాకా ప్రజెంటేషన్లతో చావగొట్టాడు. ఇప్పుడేమో సోషల్ మీడియాలో దుర్భాషలాడుతున్నారని ఎవరూ పట్టించుకోని పోస్టులను అందరికీ చూపించాడు. పాతాళంలోకి జారి పోయాడు. ఎన్ని జాకీలు పెట్టినా పచ్చ మీడియా బయటకు లాగలేదు ఈ చంద్రబాబు అంటూ వరుస ట్వీట్లతో నిప్పులు చెరిగారు.