కడప జిల్లాలోని ఏకశిలా నగిరి ఒంటిమిట్టలో రాములోరి బ్రహ్మోత్సవాల సంరంభానికి ఇవాళ రాత్రి అంకురార్పణ జరుగుతుంది.
ముందుగా వేకువజామున 4 నుంచి 6 గంటల వరకు శ్రీ సీతారామలక్ష్మణ సమేత మూలవరులకు వేదమంత్రోచ్ఛారణల మధ్య వ్యాసాభిషేకం నిర్వహించారు. తరువాత ఉత్సవ మూర్తులకు వేదోక్తంగా విష్వక్సేన పూజ నిర్వహిస్తారు. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మంగళ వాయిద్యాల నడుమ టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు, వేదపండితులు అంకురార్పణతో బ్రహ్మోత్సవ ఆరంభానికి శ్రీకారం చుడతారు