తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అరుణ్ కుమార్ మిశ్రా, ఎన్. వి రమణ తమ కుటుంబసభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. దర్శనంతరం రంగనాయకుల మండపంలో టిటిడి ఈఓ అనిల్ సింఘాల్ శ్రీవారి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని న్యాయమూర్తులకు అందజేసి సత్కరించారు.