భారత్ పౌల్ట్రీ ఉత్పత్తుల దిగుమతిపై సౌదీఅరేబియా నిషేధం విధించింది. పారిస్ కేంద్రంగా పనిచేసే ప్రపంచ పశు ఆరోగ్యసంస్థ (ఒఐఇ) నివేధిక ఆధారంగా భారతీయ పౌల్ట్రీ ఉత్పత్తుల దిగుమతులపై నిషేధం విధించినట్టు సౌదీఅరేబియా వ్యవసాయ మంత్రిత్వశాఖ వెల్లడించింది. బెంగుళూరులోని ఒక కోళ్ల ఫారంలోని కోళ్లకు ప్రమాదకరమైన బర్డ్ ఫ్లూ వ్యాధి సోకినట్టు తేలిందని, దీంతో నిషేధం చర్య తీసుకున్నామని ఆ శాఖ ప్రకటించింది.