ఏడుకొండల స్వామి దయతో సకాలంలో వర్షాలు కురిసి తెలుగు రాష్ట్రాల్లోని రైతులు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని మంత్రి హరీశ్ రావు అన్నారు.
ఈ ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న మంత్రికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తెలంగాణలోని యాదాద్రి దేవాలయంను ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నట్లు హరీష్ రావు పేర్కొన్నారు.